Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Jayamangala Venkata Ramana Meet Cm Chandrababu At The Polavaram Project And Fell At His Feet

Jayamangala Venkata Ramana: సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కిన జనసేన నేత..

Published Date :March 27, 2025 , 8:24 pm
By Sudhakar Ravula
  • సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర పరిణామం..
  • చంద్రబాబును కలిసి కాళ్లు మొక్కిన జనసేన నేత వెంకటరమణ..
  • ఇటీవలే ఎమ్మెల్సీ పదవి, వైసీపీకి జయమంగళ వెంకటరమణ రాజీనామా..
  • పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వెంకటరమణ..
Jayamangala Venkata Ramana: సీఎం చంద్రబాబు కాళ్లు మొక్కిన జనసేన నేత..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jayamangala Venkata Ramana: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు పోలవరం చేరుకున్నారు. గంట ఆలస్యంగా వచ్చినా.. ఆయన దాదాపు నాలుగు గంటల పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఇక, అనంతరం పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం అయ్యారు. నిర్వాసితులుతమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల ఖాతాల్లో 828 కోట్లు వేసామన్నారు. పది లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పిన జగన్ అయిదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని,మళ్ళీ వస్తారు..ఏదో చేస్తామంటారు.. ఏమీ చేయరు.. వారికి అధికారం తప్పా మరొకటి పట్టదని మండపడ్డారు..

Read Also: CM Chandrababu: కాంట్రాక్టర్లకు సీఎం వార్నింగ్.. అలా జరిగితే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం..!

ఇక, తన కాళ్లకు నమస్కరించిన జయమంగళ వెంకటరమణను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు సీఎం చంద్రబాబు.. కాగా, 1999లో టీడీపీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయమంగళ.. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2023 ఫిబ్రవరిలో వైసీపీలో చేరి.. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 23న వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరో వైపు, తన పర్యటనలో పోలవరం ప్రాజెక్టు అప్పర్ కాపర్ డ్యాం పై నుంచి ప్రాజెక్టును పరిశీలించారు సీఎం చందరబాబు.. తర్వాత డయాఫ్రం వాల్ పనులను, వైబ్రో కంపాక్షన్ పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంప్ సైట్ కు చేరుకున్న అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన , పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొమ్మిది నెలల్లో ప్రాజెక్టును గాడిలో పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద నీటిలో కనీసం 400లేదా 500 టీఎంసీల నీరు వాడుకుంటే, రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చంద్రబాబు చెప్ఫారు. 2014నుంచి 2019 వరకు 73 శాతం పనులు చేసశామని, 2019 తరువాత ప్రాజెక్టును చూస్తే చాలా బాధ వేస్తుందన్నారు. తెలియనితనం, అహంభావం, వివక్షత వలన ప్రాజెక్టును నాశనం చేసారన్నారు. ఒకసారి ఓట్లు వేయడం వలన రాష్ట్రానికి జీవనాడి లేకుండా చేసారని వాపోయారు. దెబ్భతిన్న డయాఫ్రం పరిశీలనకు నిపుణుల కమిటీ వచ్చిందని,కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని వారు సూచించారన్నారు .రివర్స్ టెండరింగ్ పేరుతో రాజకీయ కక్షతో డయాఫ్రం వాల్ ను పట్టించుకోలేదని, డయాఫ్రం వాల్ పని ఈ ఏడాది డిసెంబర్ నాటికి మేము పూర్తి చేస్తామన్నారు. మిగిలిన పనులన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, 2027 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలుతీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Jayamangala Venkata Ramana
  • cm chandrababu
  • feet
  • Polavaram project

తాజావార్తలు

  • Gas Discounts: గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు.. మార్చి 31 వరకే అవకాశం..

  • Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!

  • Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..

  • EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…

  • AP East-West Cargo Corridor: ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ.. నూతన పోర్టుల్లో త్వరలోనే ఆపరేషన్లు ..

ట్రెండింగ్‌

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions