Pawan Kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు. జూన్21న ముమ్మిడివరంలో పవన్ ఉదయం జనవాణి, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక, జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది. అలాగే, జూన్24, జూన్25న పి గన్నవరం, రాజోలులో పవన్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. జూన్ 25న రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ జరుగనుంది.
Read Also: Manikrao Thakre : మాణిక్ రావు థాక్రే తో విష్ణు భేటీ.. గ్రేటర్ రాజకీయంపై చర్చ
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇక పవన్ కల్యా్ణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని పవన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టు ఉందని జనసేనాని వ్యాఖ్యానించారు. నీ పతనం మొదలైంది.నీ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు అంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చాడు. మీ తాతకు బేడీలు వేసి లక్కేళ్ళినట్లు నీకు కూడా రాబోయే రోజుల్లో భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటూ పవన్ కల్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vaani Kapoor Hotness Alert: హాట్ ట్రీట్ ఇచ్చిన వాణి కపూర్.. బ్లాక్ డ్రెస్లో స్టన్నింగ్ పోజులు!
జనసేనాని చీఫ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.
ప్యాకేజీ , సీట్లు బేరం కుదరక పోవడంతో రోడ్డు మీదకి వచ్చి నన్ను సీఎం చేయండి అని పవన్ కల్యాణ్ అంటున్నాడని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!