MLA Arava Sridhar: జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి.. ఇక నిర్ణయం అధినేత చేతుల్లో!
- జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి
- మహిళా ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ
- గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ కమిటీ ముందు హాజరు.
- తన వాదనతో పాటు ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం.
Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!
Also Read
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు చేరుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం.. శ్రీధర్ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తానని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. విచారణలో ఎమ్మెల్యే ఇచ్చిన ఆధారాలు, వివరాలను కమిటీ సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికను నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగా మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో ఆరోపణలు చేసిన మహిళ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఆరోపణలు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా శ్రీధర్ వర్గం కూడా స్పందిస్తూ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు వాదనల మధ్య కమిటీ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదంపై జనసేన అధిష్టానం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!