MLA Arava Sridhar: జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి.. ఇక నిర్ణయం అధినేత చేతుల్లో!
- జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి
- మహిళా ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ
- గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ కమిటీ ముందు హాజరు.
- తన వాదనతో పాటు ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం.
Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు చేరుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం.. శ్రీధర్ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తానని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. విచారణలో ఎమ్మెల్యే ఇచ్చిన ఆధారాలు, వివరాలను కమిటీ సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికను నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగా మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో ఆరోపణలు చేసిన మహిళ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఆరోపణలు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా శ్రీధర్ వర్గం కూడా స్పందిస్తూ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు వాదనల మధ్య కమిటీ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదంపై జనసేన అధిష్టానం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!