Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ధర్మపురం మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పులి రేణుక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగన్న ఓ గీత కార్మికుడు. ఆయన తన పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రగిలిపోయాడు. దాంతో ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్దిసేపటికి హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు గుర్తించారు. అయితే పద్మ ను ఓ పదునైన ఆయుధం ఉపయోగించి గొంతు కోసి హత మార్చినట్లు గుర్తించారు.
Also read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్ను చూశారా?
ఈ విషయంపై పద్మ గొంతును గంగన్న ఓ పదునైన ఆయుధం తీసుకొని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపించారు ఆ కుటుంబ సభ్యులు. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. వీరి ఇరువురి కుటుంబంలో మధ్య సాగుభూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపానికి గురైన రేణుక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసి భరించలేకపోయిన ఆవిడ భర్త గంగన్న తన భార్య చావుకి కారణం పక్కింటి మహిళ పద్మ అని భావించి ఉలిని ఉపయోగించి ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా.. హత్యకు గురైన పద్మకు కూతురు ఓ కుమారుడు ఉన్నారు. ఇలా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమాచారం అందుకోగా వారు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!