Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ధర్మపురం మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పులి రేణుక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగన్న ఓ గీత కార్మికుడు. ఆయన తన పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రగిలిపోయాడు. దాంతో ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్దిసేపటికి హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు గుర్తించారు. అయితే పద్మ ను ఓ పదునైన ఆయుధం ఉపయోగించి గొంతు కోసి హత మార్చినట్లు గుర్తించారు.
Also read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్ను చూశారా?
ఈ విషయంపై పద్మ గొంతును గంగన్న ఓ పదునైన ఆయుధం తీసుకొని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపించారు ఆ కుటుంబ సభ్యులు. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. వీరి ఇరువురి కుటుంబంలో మధ్య సాగుభూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపానికి గురైన రేణుక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసి భరించలేకపోయిన ఆవిడ భర్త గంగన్న తన భార్య చావుకి కారణం పక్కింటి మహిళ పద్మ అని భావించి ఉలిని ఉపయోగించి ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా.. హత్యకు గురైన పద్మకు కూతురు ఓ కుమారుడు ఉన్నారు. ఇలా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమాచారం అందుకోగా వారు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!