Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
ధర్మపురం మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పులి రేణుక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగన్న ఓ గీత కార్మికుడు. ఆయన తన పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రగిలిపోయాడు. దాంతో ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్దిసేపటికి హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు గుర్తించారు. అయితే పద్మ ను ఓ పదునైన ఆయుధం ఉపయోగించి గొంతు కోసి హత మార్చినట్లు గుర్తించారు.
Also read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్ను చూశారా?
ఈ విషయంపై పద్మ గొంతును గంగన్న ఓ పదునైన ఆయుధం తీసుకొని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపించారు ఆ కుటుంబ సభ్యులు. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. వీరి ఇరువురి కుటుంబంలో మధ్య సాగుభూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపానికి గురైన రేణుక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసి భరించలేకపోయిన ఆవిడ భర్త గంగన్న తన భార్య చావుకి కారణం పక్కింటి మహిళ పద్మ అని భావించి ఉలిని ఉపయోగించి ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా.. హత్యకు గురైన పద్మకు కూతురు ఓ కుమారుడు ఉన్నారు. ఇలా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమాచారం అందుకోగా వారు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!