Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
ధర్మపురం మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పులి రేణుక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగన్న ఓ గీత కార్మికుడు. ఆయన తన పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రగిలిపోయాడు. దాంతో ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్దిసేపటికి హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు గుర్తించారు. అయితే పద్మ ను ఓ పదునైన ఆయుధం ఉపయోగించి గొంతు కోసి హత మార్చినట్లు గుర్తించారు.
Also read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్ను చూశారా?
ఈ విషయంపై పద్మ గొంతును గంగన్న ఓ పదునైన ఆయుధం తీసుకొని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపించారు ఆ కుటుంబ సభ్యులు. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. వీరి ఇరువురి కుటుంబంలో మధ్య సాగుభూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపానికి గురైన రేణుక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసి భరించలేకపోయిన ఆవిడ భర్త గంగన్న తన భార్య చావుకి కారణం పక్కింటి మహిళ పద్మ అని భావించి ఉలిని ఉపయోగించి ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా.. హత్యకు గురైన పద్మకు కూతురు ఓ కుమారుడు ఉన్నారు. ఇలా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమాచారం అందుకోగా వారు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!