Asia Cup 2023: టీమిండియా మిడిల్ ఆర్డర్కు వాళ్లు బెస్ట్ ఆప్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన ఫర్వాలేదనట్టు అనిపించినప్పటికీ.. మిడిలార్డర్ల సమస్య భారత్ ను వెంటాడుతుంది. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు ప్రస్తుతం మ్యాచ్ లు ఆడటానికి ఫిట్గా లేరు. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు.. మిడిలార్డర్లను వెతికేపనిలో ఉన్నారు. అయితే మిడిలార్డర్ లో ఆడటానికి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు బెస్ట్ అని మాజీ సెలక్టర్ సబా కరీమ్ అభిప్రాయపడ్డారు.
Kadiam Srihari: ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఫిట్గా ఉంటే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లను సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశముందని సబా కరీమ్ అన్నారు. ఆసియా కప్ లో వారికి అవకాశం రావచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇషాన్ కిషన్ ను సెలక్ట్ చేస్తే.. అతను ఓపెనింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడని తెలిపాడు. అంతేకాకుండా.. శ్రేయాస్ అయ్యర్ ఫిట్ కాకపోతే మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తిలక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్లకు అవకాశం ఇవ్వొచ్చని తెలిపారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సబా కరీం తెలిపాడు. అతనికి నేషనల్, ఇంటర్నేషనల్ వన్డేల అనుభవం ఉందని.. అతను అయితేనే బెస్ట్ అని సబా కరీమ్ పేర్కొన్నారు.
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారత్ తరఫున 26 వన్డేలు ఆడాడు. అతను 511 పరుగులు చేయగా.. అందులో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. దేశవాళీ మ్యాచ్ల్లో అతనికి మంచి రికార్డు ఉంది. మరోవైపు.. ఇషాన్ కిషన్ ఇండియా తరపున 17 వన్డేలు ఆడాడు. అతను 694 పరుగులు చేయగా.. అందులో ఒక డబుల్ సెంచరీ సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 210 పరుగులు. వన్డేల్లో భారత్ తరఫున ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!