ACB Raids : ముగిసిన నీటిపారుదల శాఖ ఏఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
- కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అరెస్ట్
- రూ.200 కోట్ల పైచిలుకు అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్టు ఆరోపణ
- నిన్న శ్రీధర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
- శ్రీధర్ను చంచల్గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids : కరీంనగర్కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని మలక్పేటలో ఉన్న శ్రీధర్ నివాసంలో సోదాలు ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి.
Vijayawada: “సుపరిపాలన.. తొలి అడుగు” పేరుతో కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ సభ..!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
శ్రీధర్ దంపతుల పేరుపై నమోదు అయిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన హైదరాబాద్ శేక్పేట్లో ఉన్న స్కై హైటెడ్ అపార్ట్మెంట్లో రూ.4500 చదరపు అడుగుల విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, మూడు ఫ్లాట్లు, మూడు ఇండివిడ్వల్ హౌస్లు, 19 ఫ్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు కార్లు, భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి పెళ్లిని థాయిలాండ్లో జరిపించిన శ్రీధర్, నగరంలోని పేరుగాంచిన హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇంకా ఆయనకు సంబంధించి బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది.
బుధవారం అర్థరాత్రి శ్రీధర్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయనను చంచల్గూడ జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసు రాష్ట్రంలో మరో సంచలన అవినీతి దర్యాప్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు. శ్రీధర్పై కేసు నమోదు చేసి పూర్తి ఆస్తుల లెక్కలు తేల్చేందుకు ఏసీబీ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
Schools Reopen : వేసవి సెలవులకు గుడ్బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..