IPL 2023: ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జెర్సీతో బరిలోకి రోహిత్ సేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు ఆదివారం వాంఖెడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగబోయే మ్యాచ్ లో ప్రత్యేక జెర్సీతో కనిపించనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ సేన.. రిసెంట్ గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్ కప్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహిళల జెర్సీని రోహిత్ సేన ధరించనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ముంబై ఆటగాళ్లు వేసుకునే జెర్సీలతో పాటు ఇందుకు గల కారణాలను వెల్లడించింది.
Also Read : LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
రోహిత్ సేన ఇలా ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీ వేసుకోవాడానికి వెనుక బలమైన కారణం ఉంది. రిలయన్స్ ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్యాంపెయిన్ లో భాగంగా ముంబై ప్లేయర్స్ ఈ జెర్సీని ధరించననున్నారు. ఆడపిల్లలకు విద్య, క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తూ వారికి క్రీడా రంగంలో కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఏ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని వారిలో స్పూర్తిని నింపేందుకు గాను ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇవాళ ఈ జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
Also Read : IPL 2023: అతను మా బంగారు కొండ అంటున్న పంజాబ్ కింగ్స్
ఈఎస్ఏ ఫౌండేషన్ డే లో భాగంగా కేకేఆర్ తో ఆడబోయే మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ ఏకంగా 36 ఎన్జీవోలలోని 19 వేల మంది చిన్నారులకు ప్రత్యక్షంగా మ్యాచ్ చూపించనున్నారు. వీరిలో 200 మంది స్పెషల్లీ ఏబుల్డ్ చిల్ట్రన్ కూడా ఉన్నారు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చేసినట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ మేరకు ముంబై ఇదివరకే అన్ని ఏర్పా్ట్లను పూర్తి చేసింది. చిన్నారులను వాంఖెడ్ కు తరలించడానికి 500 ప్రైవేట్ బస్సులు, 2 వేల మంది వాలంటీర్లను సిద్దం చేసింది. అంతేకాదు వీరికి ఆహారం అందించేందుకు కూడా ఒక లక్ష ఫుడ్ పాకెట్స్, నీటి సదుపాయాన్ని కూడా కల్పించింది. మ్యాచ్ చూడటానికి వచ్చే చిన్నారులంతా ఇవాళ వాంఖెడ్ స్టేడియంలో ఈఎస్ఏ టీ షర్ట్ లతో రోహిత్ సేనను ఎంకరేజ్ చేయనున్నాయి.
Also Read : Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..
ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ చేసినట్లు నీతా అంబానీ వెల్లడించారు. 19 వేల మంది చిన్నారులు తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసేందుకు గాను రాబోతున్నారు. వారిలో స్పూర్తి రగల్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మ్యాచ్ కు అమ్మాయిల తరపున ముంబై ఇండియన్స్ మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాబోతుందని.. టాస్ వేసే సమయంలో కూడా ఆమె అక్కడే ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!