ఇంటర్ మొదట సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు.. అక్టోబర్ 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా.. వంద శాతం సిలబస్ పూర్తిచేసే పరిస్థితి లేకపోవడంతో.. ఈ సారి 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒకటి, రెండు ఐసోలేషన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని.. వ్యాక్సిన్ తీసుకున్న వారికే పరీక్షల డ్యూటీ ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, అక్టోబర్ 26న ఇంగ్లీషు 1, అక్టోబర్ 27న మ్యాథ్స్ 1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్, 28న మాథ్స్, జువాలజీ, హిస్టరీ, 29న ఫిజిక్స్, ఎకనామిక్స్, 30న కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది ఇంటర్ బోర్డు.. ఇక, ఇప్పటి వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫీ చెల్లించిన విద్యార్థులు 4 లక్షల 59 వేలుగా ఉన్నారు.