Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఫజ్లుర్ రెహమాన్ సవాల్..
- రాజకీయాల్లోకి రావాలంటే యూనిఫాం వదిలేయండి..
- పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు పాకిస్తాన్ వ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక పీఓకేలో ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (జేయూఐ-ఎఫ్) అధిపతి మౌలానా ఫజలుర్ రెహమాన్, అసిమ్ మునీర్కు నేరుగా సవాల్ విసిరారు.
సైన్యం రాజకీయాల్లోకి రావాలనుకుంటే, యూనిఫాం విడిచిపెట్టి, సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని రెహమాన్ అన్నారు. బలూచిస్తాన్, పష్తూన్ ప్రాంతాల పరిస్థితిపై పాక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశాన్ని రక్షించడమే సైన్యం పని అని, రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆయకన అన్నారు. దేశంలో ఎవరు అధికారాన్ని చేపట్టాలి, కోల్పోవాలి అని నిర్ణయించడం సైన్యం పని కాదని ఆయన అన్నారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో పౌరులకు ఆయుధాలు ఇవ్వాలని లేదా మిలీషియాలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లు తప్పుదారి పట్టించేవని కూడా రెహమాన్ పేర్కొన్నారు. పౌరులకు ఆయుధాలు అందుబాటులోకి రావడం వల్ల మరింత రక్తపాతం మరియు వ్యక్తిగత వైరుధ్యాలు పెరిగే ప్రమాదం ఉన్నందున, తాను మాత్రం ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయనని ఆయన స్పష్టంగా తెలిపారు. బలూచిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ లేదని ఫజ్లుర్ రెహమాన్ ఆరోపించారు. పష్తూన్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, గత రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతాల నుంచి 50కి పైగా మృతదేహాలు వచ్చాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా లేరని, పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, కూలీలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని రెహమాన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!