Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఫజ్లుర్ రెహమాన్ సవాల్..
- రాజకీయాల్లోకి రావాలంటే యూనిఫాం వదిలేయండి..
- పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు పాకిస్తాన్ వ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక పీఓకేలో ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (జేయూఐ-ఎఫ్) అధిపతి మౌలానా ఫజలుర్ రెహమాన్, అసిమ్ మునీర్కు నేరుగా సవాల్ విసిరారు.
సైన్యం రాజకీయాల్లోకి రావాలనుకుంటే, యూనిఫాం విడిచిపెట్టి, సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని రెహమాన్ అన్నారు. బలూచిస్తాన్, పష్తూన్ ప్రాంతాల పరిస్థితిపై పాక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశాన్ని రక్షించడమే సైన్యం పని అని, రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆయకన అన్నారు. దేశంలో ఎవరు అధికారాన్ని చేపట్టాలి, కోల్పోవాలి అని నిర్ణయించడం సైన్యం పని కాదని ఆయన అన్నారు.
Also Read
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో పౌరులకు ఆయుధాలు ఇవ్వాలని లేదా మిలీషియాలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లు తప్పుదారి పట్టించేవని కూడా రెహమాన్ పేర్కొన్నారు. పౌరులకు ఆయుధాలు అందుబాటులోకి రావడం వల్ల మరింత రక్తపాతం మరియు వ్యక్తిగత వైరుధ్యాలు పెరిగే ప్రమాదం ఉన్నందున, తాను మాత్రం ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయనని ఆయన స్పష్టంగా తెలిపారు. బలూచిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ లేదని ఫజ్లుర్ రెహమాన్ ఆరోపించారు. పష్తూన్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, గత రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతాల నుంచి 50కి పైగా మృతదేహాలు వచ్చాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా లేరని, పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, కూలీలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని రెహమాన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!