India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దుశ్చర్య తర్వాత భారత నావికాదళం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధ బరిలోకి దిగింది. పాకిస్థాన్లో ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడి అనంతరం కరాచీ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం విధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఓడరేవుతో పాటు కరాచీ నగరంలోని పలు చోట్ల భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ భయాందోళనల్లో మునిగి పోయింది. తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది. దీంతో రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. దాడుల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలను గురవుతున్నారు. స్థానికంగా ఉన్న బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు.
READ MORE: India-Pakistan War: భయం గుప్పిట్లో పాక్.. లాహోర్లో వైమానిక రక్షణ వ్యవస్థపై భీకర దాడి..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
వాస్తవానికి.. 1971 తర్వాత కరాచీ పోర్టును భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్కి చెందిన నావికాదళానికి కరాచీ, ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలతో పాటు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఇదే ప్రదేశంలో ఉంచారు. ఈ దాడిలో అవన్నీ చాలా మట్టుకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన INS విక్రాంత్ పాకిస్థాన్ను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
READ MORE: Big News : జమ్మూలో బ్లాక్ అవుట్ ఎత్తివేత..
వాస్తవానికి.. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించారు. ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ఇది ఒక భారతీయ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక. వందకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా సంస్థల సహకారంతో ఈ నౌకను నిర్మించారు. 2022 వరకు భారత్ వద్ద ఒకే ఒక్క విమాన వాహక నౌక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇలాంటివి రెండు ఉన్నాయి. దీంతో సొంతంగా విమాన వాహక నౌకలను నిర్మిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది. భారత్లో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరే పెట్టారు.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..