Uttarakhand Minister: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
Uttarakhand Minister: ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు. రాహుల్ గాంధీ తెలివితేటలపై జాలిపడుతున్నానని ఆయన ఎద్దేవా చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ల బలిదానాలు జరిగాయన్నారు. గాంధీ కుటుంబ సభ్యులతో జరిగినవి ప్రమాదాలేనని.. బలిదానాలకు, ప్రమాదాలకు మధ్య వ్యత్యాసం ఉందని జోషి అన్నారు.
శ్రీనగర్లో తన భారత్ జోడో యాత్ర ముగింపులో కాంగ్రెస్ నాయకుడి ముగింపు ప్రసంగం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఒకరు తమ తెలివితేటల స్థాయిని బట్టి మాత్రమే మాట్లాడగలరని ఆయన విలేకరులతో అన్నారు. రాష్ట్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న జోషి.. జమ్మూకశ్మీర్లో రాహుల్ గాంధీ యాత్రను సజావుగా ముగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఘనత కూడా ఇచ్చారు. ఆ ఘనత ప్రధానమంత్రికే చెందుతుందని.. ఆయన నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండకపోతే, రాహుల్గాంధీ లాల్చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉండేవారు కాదన్నారు. బీజేపీ నేత మురళీ మనోహర్ జమ్మూకశ్మీర్లో హింస ఉద్ధృతంగా ఉన్నప్పుడు లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారని జోషి చెప్పారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Shanti Bhushan: కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ హత్య గురించి తనకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, హింసను ప్రేరేపించే వారు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.హింసను ప్రేరేపించే మోదీజీ, అమిత్ షాజీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్లకు ఈ బాధ ఎప్పటికీ అర్థం కాదు.. ఆర్మీ మనిషి కుటుంబానికి అర్థం అవుతుందన్నారు.పుల్వామాలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబానికి అర్థం అవుతుందన్నారు. కశ్మీరీలు కూడా అర్థం చేసుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో