Bomb Threat: జబల్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఫ్లైట్కు బాంబు బెదిరింపులు..
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు
- జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఫ్లైట్
- నాగ్పూర్కు విమానం దారి మళ్లింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్పూర్కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్పూర్లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు. అంతకుముందు ఆగస్టు 22న బాంబు బెదిరింపు రావడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించారు. సమాచారం ప్రకారం.. విమానం నాగ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానయాన సంస్థ ప్రయాణికులకు విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
Also Read
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
కాగా.. ప్రతిరోజూ ఆసుపత్రులు, విమానాలపై బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. జూన్ 18న ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరించారు. అందులో.. జైపూర్, చెన్నై, వారణాసి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. తర్వాత విచారణలో అది ఫేక్ అని తేలింది. చాలా సార్లు.. ఇటువంటి బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Cancelled Trains: వర్షాల ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
బెదిరింపులకు పాల్పడే ప్రయాణికుల్లో ఎవరైనా ఉంటే.. వారిపై ఐదేళ్లపాటు విమానయాన నిషేధం విధించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో.. జూన్ 17న 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుపై బాంబులు వేస్తామని బాలుడు బెదిరించారు. దీంతో.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. గతంలో ముంబై సహా పలు నగరాల్లోని 60 ఆసుపత్రులను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ ఇమెయిల్లు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) ద్వారా ఆసుపత్రి పబ్లిక్ ఇమెయిల్ IDకి పంపించారు.
తాజావార్తలు
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!