Bomb Threat: జబల్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఫ్లైట్కు బాంబు బెదిరింపులు..
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు
- జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఫ్లైట్
- నాగ్పూర్కు విమానం దారి మళ్లింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబల్పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్పూర్కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్పూర్లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు. అంతకుముందు ఆగస్టు 22న బాంబు బెదిరింపు రావడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించారు. సమాచారం ప్రకారం.. విమానం నాగ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానయాన సంస్థ ప్రయాణికులకు విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
కాగా.. ప్రతిరోజూ ఆసుపత్రులు, విమానాలపై బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. జూన్ 18న ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరించారు. అందులో.. జైపూర్, చెన్నై, వారణాసి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. తర్వాత విచారణలో అది ఫేక్ అని తేలింది. చాలా సార్లు.. ఇటువంటి బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Cancelled Trains: వర్షాల ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
బెదిరింపులకు పాల్పడే ప్రయాణికుల్లో ఎవరైనా ఉంటే.. వారిపై ఐదేళ్లపాటు విమానయాన నిషేధం విధించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో.. జూన్ 17న 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుపై బాంబులు వేస్తామని బాలుడు బెదిరించారు. దీంతో.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. గతంలో ముంబై సహా పలు నగరాల్లోని 60 ఆసుపత్రులను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ ఇమెయిల్లు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) ద్వారా ఆసుపత్రి పబ్లిక్ ఇమెయిల్ IDకి పంపించారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!