Covid Outbreak: 3 వేల మార్క్కు దగ్గరగా యాక్టివ్ కేసులు.. అప్రమత్రంగా ఉండాలని కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Outbreak: భారత్లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. 10 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
Read Also: Terrorists Attack: ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల మెరుపు దాడి.. ఐదుగురు సైనికులు మృతి
Also Read
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
కొవిడ్ -19 నుంచి ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు, 220.67 కోట్ల (220,67,79,081) డోస్ల కొవిడ్ వ్యాక్సిన్ను అందించారు. JN.1 మొదటిసారిగా గుర్తించబడిన కేరళలో, గత 24 గంటల్లో మరో 265 కేసులు నమోదైన తర్వాత క్రియాశీల కేసులు 2,606కి పెరిగాయి. దేశవ్యాప్తంగా బుధవారం వరకు JN.1 వేరియంట్కు సంబంధించిన 21 కేసులు కనుగొనబడ్డాయి. గురువారం, భారతదేశంలో 594 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 2,311 నుండి 2,669కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరుగురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, పంజాబ్కు చెందిన ఒకరు కరోనా కారణంగా మరణించారు.
Read Also: Year End 2023 : 2023 లో వార్తల్లో నిలిచిన భయంకరమైన వ్యాధులు ఇవే..
బీహార్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్
బీహార్లోని పాట్నాలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐజీఐఎంఎస్)లో ఒకరిని పాజిటివ్గా గుర్తించగా… బిహ్తాలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో మరొకరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరు వ్యక్తులను హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ఇద్దరు రోగుల ప్రయాణ చరిత్ర కనుగొనబడిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొదటి రోగి పాట్నాలోని గార్డ్నిబాగ్లో నివసిస్తున్న 29 ఏళ్ల వ్యక్తి కాగా, రెండో రోగి బంకా జిల్లా వాసి. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించిన తర్వాత, రోగులు JN.1తో బాధపడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
ప్రస్తుతం కొవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడవద్దని కేంద్రం ప్రభుత్వం కోరింది. ముందుజాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్లు ధరించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించారు. కొవిడ్ వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, 92.8 శాతం కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయని, ఇది తేలికపాటి అనారోగ్యాన్ని సూచిస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు. భారతదేశంలో JN.1 వేరియంట్ కారణంగా ఎటువంటి క్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అన్ని కేసులు తేలికపాటివిగా గుర్తించబడ్డాయి. రోగులు ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!