Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud: పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని.. కొండా సుస్మిత లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ స్పష్టం చేశారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్ విమర్శలు చేయలేదని.. కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై అధిష్టానం సీరియస్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ఈ మహేష్గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ భేటీపై మల్లు రవి మాట్లాడారు. “మూడు విషయాలపై చర్చ చేశాం. కొండా సురేఖకి ఇచ్చిన నోటీసుకు రిప్లై వచ్చింది. సుస్మిత మాట్లాడిన వీడియోలు చూశాం. సుస్మిత మాట్లాడిన వీడియోలు చూస్తే అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు చూశాం. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తాం అన్నారు. అందరి ఫిర్యాదులు తీసుకున్నాక.. మరోసారి భేటీ అవుతాం. చిన్నారెడ్డి కూడా వివరణ ఇచ్చారు. వివరణ చదివాం.. వీడియోలు కూడా చూశాం. ఎమ్మెల్యే మేఘరెడ్డిని కమిటీ ముందుకు పిలుస్తున్నాం. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై మేఘరెడ్డి నుంచి కూడా వివరణ తీసుకుంటాం. ఆదిలాబాద్ ఇష్యూలో కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి పంచాయతీలో శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. దీనిపై మంత్రి జూపల్లి తో మాట్లాడాం.. డీసీసీతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ చేసిన తర్వాత గాంధీ భవన్లో మధు యాష్కీ మీద ఆరోపణలు చేశారు. తప్పని సరి పరిస్థితిలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. కానీ పార్టీకి నష్టం జరుగుతుంది అని ఫిర్యాదు వచ్చింది. అందుకే నోటీసులు ఇచ్చాం. కొండా సురేఖ సహజ న్యాయం ప్రస్తావన చేశారు. కేబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ… సీఎం మీద ఎవరు మాట్లాడినా ఖండించాలి. ఎందుకు ఖండించలేదు అనేది కూడా అడుగుతాం. ఎలాగైనా రిప్లై ఇచ్చే హక్కు వాళ్లకు ఉంది. దానిపై మేం అధ్యయనం చేస్తున్నాం. కొండా సురేఖ ఇప్పుడే నాతో మాట్లాడారు.” అని వివరణ ఇచ్చారు.
Also Read
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
తాజావార్తలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!