Asian Games 2023: కొనసాగుతున్న భారత అథ్లెట్ల హవా.. సెమీ-ఫైనల్కు నిఖత్ జరీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది. ఈ మ్యాచ్లో నిఖత్ జరీన్ మొదటి నుంచి చాలా దూకుడుగా కనిపించింది. నిఖత్ తొలి రౌండ్లో కేవలం 53 సెకన్లలోనే విజయం సాధించింది. జోర్డాన్ ఆటగాడు నిఖత్ ఆట ముందు చేతులెత్తేశాడు. నిఖత్ కేవలం 127 సెకన్లలో మ్యాచ్ను ముగించి సెమీ ఫైనల్స్లో చోటు దక్కించుకుంది.
Women Reservation Bill: చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 32 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్, రోయింగ్ ఈవెంట్లలో ఇండియా ఎక్కువ విజయాలను సాధించింది. అంతేకాకుండా.. ఈసారి గుర్రపు స్వారీలో కూడా దేశానికి పతకం వచ్చింది. సెప్టెంబర్ 29న టెన్నిస్లో భారత్కు తొలి పతకం రజత పతకం రూపంలో వచ్చింది. భారత పురుషుల డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, రామ్కుమార్ రామనాథన్ ఫైనల్ మ్యాచ్లో ఓడి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Rainbow Hospital: గుండె లోపాలను జయించిన చిన్నారులతో వరల్డ్ హార్ట్ డే
ఇక షూటింగ్లో.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ బంగారు, రజత పతకాలను గెలుచుకుంది. ఇందులో ఇషా పాలక్ 242.1 స్కోరుతో స్వర్ణం సాధించగా.. ఇషా సింగ్ 239.7 స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సెమీఫైనల్కు చేరుకుని పతకం సాధించింది. నేపాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్యాడ్మింటన్ జట్టు ఏకపక్షంగా 3-0తో విజయం సాధించింది. 1986 ఆసియా క్రీడల తర్వాత భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో పతకం సాధించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!