IND vs PAK: అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ప్రత్యేక వందే భారత్ రైళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అహ్మదాబాద్కు అభిమానులు రానున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్, పరిసర ప్రాంతాల హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు పలు నగరాల నుంచి అహ్మదాబాద్కు వెళ్లే విమాన టికెట్ రేట్స్ సైతం ఎక్కువగానే ఉన్నాయి. దాంతో అభిమానుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పింది.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
Also Read: PAK vs NED: టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్!
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. త్వరలోనే షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. అహ్మదాబాద్లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, పెరిగిన విమాన టికెట్ ధరల వంటి వాటి నుంచి అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?