IND vs PAK: అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ప్రత్యేక వందే భారత్ రైళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అహ్మదాబాద్కు అభిమానులు రానున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్, పరిసర ప్రాంతాల హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు పలు నగరాల నుంచి అహ్మదాబాద్కు వెళ్లే విమాన టికెట్ రేట్స్ సైతం ఎక్కువగానే ఉన్నాయి. దాంతో అభిమానుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పింది.
Also Read
Also Read: PAK vs NED: టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్!
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. త్వరలోనే షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. అహ్మదాబాద్లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, పెరిగిన విమాన టికెట్ ధరల వంటి వాటి నుంచి అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!