Team India: రేపు ప్రధాని మోడీని కలవనున్న భారత ఆటగాళ్లు..
- బార్బడోస్ నుంచి ఇండియాకు బయల్దేరిన టీమిండియా
- రేపు ఉదయం 6.00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
- రేపు ప్రధాని మోడీని కలవనున్న భారత ఆటగాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ట్రోఫీని సాధించిన భారత ప్లేయర్లకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Amla Juice : ఈ జ్యూస్ తరుచు తాగారో ఇక రోగాలు రమ్మన్న రావంతే..
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
మరోవైపు.. టీమిండియా స్వదేశానికి తిరిగొస్తున్న నేపథ్యంలో ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ వరల్డ్ కప్ ట్రోఫీ ఉన్న వీడియోను బీసీసీఐ తాజాగా ఎక్స్ లో షేర్ చేసింది. వరల్డ్ కప్ విన్నర్స్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. కాగా.. రేపు ఢిల్లీకి చేరుకున్నాక భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఇప్పటికే.. భారత్ వరల్డ్ కప్ సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఫోన్లో భారత ఆటగాళ్లతో మాట్లాడి అభినందించారు. కాగా.. రేపు ప్రధానిని నేరుగా కలవనున్నారు. అనంతరం.. ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించబోయే పలు కార్యక్రమాల్లో టీమిండియా పాల్గొననుంది. అందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
Read Also: UP Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!