Indian Cities: రాత్రుల్లో నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్లో మాత్రం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Night Time Temperatures: రోజు రోజుకు పెరిగిపోతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచేస్తున్నాయి. గత దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (సీఎస్ఈ) నివేదికలో వెల్లడించింది. జనవరి 2001 నుంచి ఏప్రిల్ 2024 వరకు దేశంలోని ప్రధానమైన ఆరు మహా నగరాలు- ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో వేసవి తీవ్రతను ఇందులో విశ్లేషించింది. గాలివేడి, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, గాలిలో తేమకు సంబంధించిన అంశాలను పరిగణనలో తీసుకుంది.
Read Also: Naga Vamsi : జూన్ 10 న బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
అయితే, పెరిగిన తేమ.. అన్ని వాతావరణ జోన్లలో వేడిని మరింత తీవ్రతరం చేస్తోంది అని సీఎస్ఈ పేర్కొనింది. ఢిల్లీ, హైదరాబాద్లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పుకొచ్చింది. బెంగళూరు మినహా మిగిలిన ఐదు మహా నగరాల్లో 2001-10 సగటుతో పోలిస్తే 2014-2023 మధ్య వేసవికాల తేమ సగటున 5 నుంచి 10 శాతం పెరిగిందని సూచించింది. 2001-10 మధ్య ఉష్ణోగ్రతలు రాత్రిపూట 6.20 – 13.20 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గేవని.. కానీ, 2014 నుంచి 2023 మధ్య 6. 20-11.50 డిగ్రీలు మాత్రమే తగ్గింది అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదికలో వెల్లడించింది.
Read Also: Sunrisers Hyderabad: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఎన్నెన్నో రికార్డులు సొంతం!
కాగా, పగటి ఉష్ణోగ్రతల మాదిరే వేడిరాత్రులు ప్రమాదకరమైనవి అంటూ సీఎస్ఈ చెప్పుకొచ్చింది. ఆరు నగరాల్లో రుతుపవనాల కాలాలు గతంలో కంటే వేడిగా ఉంటున్నాయని పేర్కొనింది. పట్టణేతర ప్రాంతాలతో పోలిస్తే 140కి పైగా నగరాలు దాదాపు 60 శాతం కంటే ఎక్కువగా రాత్రిపూట వేడిని ఎదుర్కొంటున్నాయని తాజా పరిశోధనలో తెలింది. కాంక్రీటు, తారు కలిగిన ఉపరితలాలు పగటిపూట వేడిని నిల్వ చేసుకొని సాయంత్రం రిలీజ్ చేస్తాయిన నివేదించింది. దీంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే వాయవ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది వెల్లడించింది. దేశం మొత్తంరెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయన్నారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!