IND vs AUS: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ కాసేపు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది. మరోవైపు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లను తగ్గించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో ఆస్ట్రేలియా 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు.
Read Also: Parineeti Chopra Marriage: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
వర్షం ఆగిన తర్వాత మళ్లీ ఆట ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా 144 బంతుల్లో 261 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరంభంలోనే వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. ఓ దశలో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ని తనవైపుకు తీసుకెళ్తుందని అనిపించినా.. ఆ తర్వాత అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ని మలుపుతిప్పారు. భారత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన ముందు ఆస్ట్రేలియా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అయితే చివరిలో సీన్ అబాట్, జోష్ హేజిల్వుడ్ ఓటమి మార్జిన్ను తగ్గించారు. అబాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. జోష్ హేజిల్వుడ్ (23)తో కలిసి 9వ వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Read Also: Kangana Ranaut :కంగనా ఆ హీరోకు పెద్ద ఫ్యాన్.. ఎందుకో తెలుసా?
మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ ఔటైన వెంటనే.. అందులోని ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. మార్నస్ లాబుస్చాగ్నే (27), జోష్ ఇంగ్లిస్ (06), అలెక్స్ కారీ (14), కెమెరాన్ గ్రీన్ (19), ఆడమ్ జంపా (05) పరుగులు మాత్రమే చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలతో స్కోరు భారీగా వెళ్లింది. అటు కేఎల్ రాహుల్, సుర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత్ ఇన్సింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్(8), శుభ్ మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్(105), రాహుల్(52), ఇషాన్ కిషన్(31), సూర్యకుమార్ యాదవ్(72), రవీంద్ర జడేజా(13) పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!