IND vs AUS: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ కాసేపు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గడంతో తిరిగి ప్రారంభమైంది. మరోవైపు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లను తగ్గించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో ఆస్ట్రేలియా 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు.
Read Also: Parineeti Chopra Marriage: వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
వర్షం ఆగిన తర్వాత మళ్లీ ఆట ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా 144 బంతుల్లో 261 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరంభంలోనే వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. ఓ దశలో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ని తనవైపుకు తీసుకెళ్తుందని అనిపించినా.. ఆ తర్వాత అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ని మలుపుతిప్పారు. భారత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన ముందు ఆస్ట్రేలియా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అయితే చివరిలో సీన్ అబాట్, జోష్ హేజిల్వుడ్ ఓటమి మార్జిన్ను తగ్గించారు. అబాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. జోష్ హేజిల్వుడ్ (23)తో కలిసి 9వ వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Read Also: Kangana Ranaut :కంగనా ఆ హీరోకు పెద్ద ఫ్యాన్.. ఎందుకో తెలుసా?
మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ ఔటైన వెంటనే.. అందులోని ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. మార్నస్ లాబుస్చాగ్నే (27), జోష్ ఇంగ్లిస్ (06), అలెక్స్ కారీ (14), కెమెరాన్ గ్రీన్ (19), ఆడమ్ జంపా (05) పరుగులు మాత్రమే చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలతో స్కోరు భారీగా వెళ్లింది. అటు కేఎల్ రాహుల్, సుర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత్ ఇన్సింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్(8), శుభ్ మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్(105), రాహుల్(52), ఇషాన్ కిషన్(31), సూర్యకుమార్ యాదవ్(72), రవీంద్ర జడేజా(13) పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!