India vs Pakistan: “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను”.. పాక్ మాజీ ప్లేయర్ మాస్టర్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాయి. సాయంత్రం అన్ని పనులు పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ మ్యాచ్కు వర్షం పెద్ద అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం(R. Premadasa Stadium)లో ఆదివారం జరగాల్సిన ఈ హై వోల్టేజ్ పోరుకు ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి. భారీ వర్షం పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ చెబుతోంది. అక్క్యూవెదర్ ప్రకారం వర్షం పడే అవకాశం 93 శాతం వరకు ఉందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చెలరేగే ఈదురుగాలులతో పాటు మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పగలు 65 శాతం వరకు వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి ఆ శాతం 25కు తగ్గుతుందని చెప్పినా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి మళ్లీ 49 నుంచి 65 శాతం వరకు ఉండొచ్చని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.
READ MORE: Kotappakonda: కోటప్పకొండకు భక్తుల తాకిడి.. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు
Also Read
- Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా 'బ్రదర్'.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
ఈ పరిస్థితుల్లో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అభిమానులంతా మ్యాచ్ జరగాలని కోరుకుంటే.. ఆయన మాత్రం “వర్షం పడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చెప్పాడు. పూర్తి మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు “నాకు వర్షమే కావాలి” అని మళ్లీ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇలా చెప్పడంలో బలమైన కారణం ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్కు సూపర్ ఎయిట్ (Super 8) దారి సులభమవుతుంది. టీ20 మ్యాచ్కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్లు ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే మ్యాచ్ను రద్దు చేసినట్టే. గ్రూప్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. అలాంటప్పుడు రెండు జట్లకూ ఒక్కో పాయింట్ ఇస్తారు. ఇప్పటికే గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ రెండూ రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో భారత్ ముందు ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయి పాయింట్లు పంచుకుంటే.. రెండు జట్లు సూపర్ ఎయిట్ (Super 8) దశకు దాదాపు చేరినట్టే. ఎందుకంటే మిగతా జట్లు అయిన అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా గరిష్టంగా నాలుగు పాయింట్ల వరకే రావచ్చు.
READ MORE: India vs Pakistan: ‘హ్యాండ్ షేక్’పై సూర్య సంచలన ప్రకటన.. పాక్ కండీషన్.. భారత్ ఒప్పుకుంటుందా?
తాజావార్తలు
-
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
-
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!