BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్, బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్) కోర్సులకు తాత్కాలిక ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో ప్రకారం.. ఈ విద్యా సంవత్సరానికి కనీస వార్షిక ఫీజును రూ.47 వేలుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను నిర్ణయించే వరకు ఈ ఇంటరిమ్ ఫీజులు అమల్లో ఉంటాయి. EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే గతంలో నిర్ణయించిన ఫీజులు రూ.47 వేల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అదే ఫీజులను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ తుది ఫీజులను ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ఫీజులు అమలులోకి వస్తాయని పేర్కొంది. తుది ఫీజులు నిర్ణయించిన తర్వాత ఇంటరిమ్ ఫీజు కంటే తక్కువగా ఉంటే విద్యార్థులకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కళాశాలలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది లేదా భవిష్యత్ ఫీజుల్లో సర్దుబాటు చేయాలి. ఒకవేళ తుది ఫీజు ఎక్కువగా నిర్ణయిస్తే.. ఆ ఫీజును ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కళాశాల కూడా తుది ఫీజు నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అనుబంధ విశ్వవిద్యాలయానికి అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కళాశాలలు నోటిఫై చేసిన ఫీజు తప్ప మరే పేరుతోనూ అదనపు మొత్తాలు వసూలు చేయకూడదు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లేని కళాశాలలు ఎలాంటి ఫీజులు వసూలు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభించిన కోర్సులకు అదే కళాశాలలో అమలులో ఉన్న ఇతర కోర్సుల ఫీజులను తాత్కాలికంగా వర్తింపజేయాలని, అనంతరం కమిటీ నిర్ణయించే కోర్సు వారీ ఫీజులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. విద్యార్థులు అడ్మిషన్ సమయంలో వసూలు చేస్తున్న ఫీజు తాత్కాలికమని, APHEFRMC తుది నిర్ణయం తర్వాత మార్పులకు లోబడి ఉంటుందని కళాశాలలు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!