BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్, బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్) కోర్సులకు తాత్కాలిక ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో ప్రకారం.. ఈ విద్యా సంవత్సరానికి కనీస వార్షిక ఫీజును రూ.47 వేలుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను నిర్ణయించే వరకు ఈ ఇంటరిమ్ ఫీజులు అమల్లో ఉంటాయి. EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే గతంలో నిర్ణయించిన ఫీజులు రూ.47 వేల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అదే ఫీజులను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ తుది ఫీజులను ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ఫీజులు అమలులోకి వస్తాయని పేర్కొంది. తుది ఫీజులు నిర్ణయించిన తర్వాత ఇంటరిమ్ ఫీజు కంటే తక్కువగా ఉంటే విద్యార్థులకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కళాశాలలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది లేదా భవిష్యత్ ఫీజుల్లో సర్దుబాటు చేయాలి. ఒకవేళ తుది ఫీజు ఎక్కువగా నిర్ణయిస్తే.. ఆ ఫీజును ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కళాశాల కూడా తుది ఫీజు నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అనుబంధ విశ్వవిద్యాలయానికి అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కళాశాలలు నోటిఫై చేసిన ఫీజు తప్ప మరే పేరుతోనూ అదనపు మొత్తాలు వసూలు చేయకూడదు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లేని కళాశాలలు ఎలాంటి ఫీజులు వసూలు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభించిన కోర్సులకు అదే కళాశాలలో అమలులో ఉన్న ఇతర కోర్సుల ఫీజులను తాత్కాలికంగా వర్తింపజేయాలని, అనంతరం కమిటీ నిర్ణయించే కోర్సు వారీ ఫీజులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. విద్యార్థులు అడ్మిషన్ సమయంలో వసూలు చేస్తున్న ఫీజు తాత్కాలికమని, APHEFRMC తుది నిర్ణయం తర్వాత మార్పులకు లోబడి ఉంటుందని కళాశాలలు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!