Champions Trophy 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. నిమిషాల్లోనే టికెట్లు ఖతం
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
- 23న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్
- నిమిషాల్లోనే ఈ మ్యాచ్ టికెట్లు సేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కేవలం భారత్, పాక్ ఫ్యాన్స్ కాకుండా.. ఇతర దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే 23న భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: HariHara VeeraMallu: పవన్ సినిమాకి మోక్షం.. చెప్పిన డేటుకే దించుతున్నారు!
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
కాగా.. ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు ఖతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగనున్నాయి. కాగా.. భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఐసీసీ సోమవారం సాయంత్రం 5.30కు ఆన్లైన్లో ఉంచింది. ఈ క్రమంలో నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయి. గరిష్ట టికెట్లు రూ. 47 వేలు, రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. ఇతర మ్యాచ్ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ. 10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా ఉండటం గమనార్హం.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
మరోవైపు.. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో సైట్ స్లో అయిపోయింది. సుమారు 1,50,000 మందికి పైగా టక్కెట్ బుక్ చేసుకునేందుకు ఆన్లైన్లో క్యూలో ఉన్నారు. దీంతో బుకింగ్ వెయిటింగ్ టైమ్ గంటకు మించిపోయింది. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్కు ఉన్న అపారమైన ప్రజాదరణ అంటే క్లియర్గా అర్థమవుతోంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్, యూఏఈలో హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. 19 రోజుల పాటు 15 మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్ Aలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!