Champions Trophy 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. నిమిషాల్లోనే టికెట్లు ఖతం
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
- 23న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్
- నిమిషాల్లోనే ఈ మ్యాచ్ టికెట్లు సేల్.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కేవలం భారత్, పాక్ ఫ్యాన్స్ కాకుండా.. ఇతర దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే 23న భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: HariHara VeeraMallu: పవన్ సినిమాకి మోక్షం.. చెప్పిన డేటుకే దించుతున్నారు!
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
కాగా.. ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు ఖతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగనున్నాయి. కాగా.. భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఐసీసీ సోమవారం సాయంత్రం 5.30కు ఆన్లైన్లో ఉంచింది. ఈ క్రమంలో నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయి. గరిష్ట టికెట్లు రూ. 47 వేలు, రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. ఇతర మ్యాచ్ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ. 10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా ఉండటం గమనార్హం.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
మరోవైపు.. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో సైట్ స్లో అయిపోయింది. సుమారు 1,50,000 మందికి పైగా టక్కెట్ బుక్ చేసుకునేందుకు ఆన్లైన్లో క్యూలో ఉన్నారు. దీంతో బుకింగ్ వెయిటింగ్ టైమ్ గంటకు మించిపోయింది. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్కు ఉన్న అపారమైన ప్రజాదరణ అంటే క్లియర్గా అర్థమవుతోంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్, యూఏఈలో హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. 19 రోజుల పాటు 15 మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్ Aలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!