Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
- లోక్సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ విరుచుకుపడుతోంది. చైనా దళాలు భారతదేశంలోకి చొచ్చుకువచ్చాయని, ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఆహ్వానం కోసం ప్రధాని మోడీ, జైశంకర్ని యూఎస్కి పంపించారంటూ సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం వివాదాస్పదమైంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు రుజువులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read Also: Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆధారాలు అందించకోతే ఆయనపై ప్రత్యేక హక్కుల నోటీసులు తీసుకువావాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభా హక్కుల తీర్మానం, ఇది హక్కుల్ని దుర్వినియోగం చేయడం లేదా పార్లమెంట్ని తప్పుదారి పట్టించే సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రయోగించవచ్చు.
సోమవారం లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మేకిన్ ఇండియా విఫలమైందని, చైనా బలగాలు మన దేశ భూభాగంలో ఉన్నాయని ఆరోపించారు. చైనా మన దేశంలోని 4000 చ.కి.మీ ఆక్రమించిందని, ప్రభుత్వం ఏ భూమిని ఆక్రమించలేదని తప్పుగా చెబుతోందని ఆయన అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కోసం “ప్రధానమంత్రి ఆహ్వానం పొందడానికి” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను అనేకసార్లు అమెరికాకు పంపారని ఆరోపించారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతున్నారని, ఇది రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని అన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
ట్రెండింగ్
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!