India Slams Pakistan: ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్.. మండిపడిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Slams Pakistan: రష్యాపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు భారత్ బుధవారం తగిన సమాధానం ఇచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐరాస జనరల్ అసెంబ్లీ(UNGA)లో జరిగిన ఓటింగ్పై తన వివరణలో పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ రెండు పరిస్థితుల మధ్య సమాంతరాలను రూపొందించే ప్రయత్నంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ ఫోరమ్ను దుర్వినియోగం చేయడానికి భారత్పై అర్థంలేని వ్యాఖ్యలు చేయడానికి ఒక ప్రతినిధి బృందం చేసిన ప్రయత్నం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె అన్నారు. పదేపదే అబద్ధాలు చెప్పే మనస్తత్వం నుంచి ఇటువంటి ప్రకటన సామూహిక ధిక్కారానికి అర్హమైనది అని భారత దౌత్యవేత్త అన్నారు.జమ్మూ కాశ్మీర్ మొత్తం భూభాగం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని రుచిరా కాంబోజ్ తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపాలని తాము పాకిస్తాన్ను కోరుతున్నామన్నారు. తద్వారా పౌరులు జీవించే హక్కును స్వేచ్ఛగా ఆస్వాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
Also Read
అంతకుముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 143 మంది, వ్యతిరేకంగా ఐదుగురు సభ్యులు ఓటు వేశారు. భారత్ సహా మొత్తం 35 దేశాలు తీర్మానానికి దూరంగా ఉన్నాయి. రష్యాను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దూరంగా ఉన్న తర్వాత, ఉక్రెయిన్లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా సంఘర్షణ తీవ్రతరం కావడంపై భారతదేశం బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
PM Narendra Modi: నాలుగో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
భద్రతా మండలిలో రష్యా ఇదే విధమైన ప్రతిపాదనను వీటో చేసిన తర్వాత వచ్చిన తాజా తీర్మానంలో పలు దేశాలు అక్రమ విలీన ప్రయత్నాలను ఖండించినట్లు తెలుస్తోంది.సభ్య దేశాల ముందు ఓటు గురించి తన వివరణను అందజేస్తూ భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. మానవ వ్యయంతో ఎటువంటి పరిష్కారాన్ని చేరుకోలేమని, శత్రుత్వాలు పెరగడం ఎవరికీ ప్రయోజనం కాదని భారతదేశం స్థిరంగా వాదిస్తున్నదని అన్నారు. దౌత్య పద్ధతిలో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ఆమె భారత్ తరఫున వివరించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!