Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban Sugar Exports: అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో, అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వర్షాభావ పరిస్థితులను అనుసరించి ఈ ఊహించిన చర్య జరగనున్నట్లు సమాచారం.
Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
ఏడేళ్ల తర్వాత భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళనలను ఎదుర్కొంటోంది. జులైలో రీటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 7.4 శాతానికి ఎగబాకడం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరడంతో భారత్ చెరకు ఎగుమతులపై బ్యాన్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని చెబుతున్నారు.మూడేళ్ల గరిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆహారోత్పత్తుల ధరలకు చెక్ పెట్టేందుకు ఎగుమతులపై నిషేధం అనివార్యమని సర్కారు ఆలోచిస్తోంది. ఇక 2023-24 సీజన్లో చెరకు దిగుబడి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా. గత సీజన్లో 11.1 మిలియన్ టన్నుల చక్కెరతో పోలిస్తే, ప్రస్తుత సీజన్లో 6.1 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి భారతదేశం మిల్లులను అనుమతించిన తర్వాత ఇది జరిగింది.
ఈ పరిణామాల మధ్య, భారతీయ అధికారులు స్థానిక చక్కెర అవసరాలకు, మిగులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంభావ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తగినంత సరఫరాలు, స్థిరమైన ధరలను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించడం వంటి చర్యలకు పూనుకున్న భారత్ తాజాగా చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఆహార ధరలను నిర్వహించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!