Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
Ban Sugar Exports: అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో, అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వర్షాభావ పరిస్థితులను అనుసరించి ఈ ఊహించిన చర్య జరగనున్నట్లు సమాచారం.
Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ఏడేళ్ల తర్వాత భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళనలను ఎదుర్కొంటోంది. జులైలో రీటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయిలో 7.4 శాతానికి ఎగబాకడం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరడంతో భారత్ చెరకు ఎగుమతులపై బ్యాన్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని చెబుతున్నారు.మూడేళ్ల గరిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆహారోత్పత్తుల ధరలకు చెక్ పెట్టేందుకు ఎగుమతులపై నిషేధం అనివార్యమని సర్కారు ఆలోచిస్తోంది. ఇక 2023-24 సీజన్లో చెరకు దిగుబడి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా. గత సీజన్లో 11.1 మిలియన్ టన్నుల చక్కెరతో పోలిస్తే, ప్రస్తుత సీజన్లో 6.1 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి భారతదేశం మిల్లులను అనుమతించిన తర్వాత ఇది జరిగింది.
ఈ పరిణామాల మధ్య, భారతీయ అధికారులు స్థానిక చక్కెర అవసరాలకు, మిగులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంభావ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తగినంత సరఫరాలు, స్థిరమైన ధరలను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించడం వంటి చర్యలకు పూనుకున్న భారత్ తాజాగా చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఆహార ధరలను నిర్వహించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!