పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: సినిమాలు, వెబ్సిరీస్లు, ఇతర కాపీరైట్ కంటెంట్ పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ (Telegram)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) నోటీసు జారీ చేసింది. పైరసీ కంటెంట్ను వెంటనే తొలగించి, తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని ఆదేశించింది.
భారత క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, టెలివిజన్ ప్రసార సంస్థలు, ఓటీటీ వేదికలు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. పైరసీకి పాల్పడుతున్న ఛానళ్లు, గ్రూపులు, బాట్లు, ఖాతాలు, అడ్మినిస్ట్రేటర్లు, అనుబంధ సంస్థలపై కూడా టెలిగ్రామ్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
ఈ మధ్యకాలంలో పలు ఓటీటీ సంస్థలు, కంటెంట్ యజమానులు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తమ కాపీరైట్ కలిగిన సినిమాలు, వెబ్సిరీస్లు టెలిగ్రామ్లో అనుమతి లేకుండా విస్తృతంగా షేర్ అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం మొత్తం 3,142 టెలిగ్రామ్ ఛానళ్లు పైరసీ కంటెంట్ను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించింది. దీనితో సమాచార సాంకేతిక చట్టం-2000 (IT Act, 2000) కింద టెలిగ్రామ్కు నోటీసులు జారీ చేశారు. కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన కంటెంట్ను తొలగించడంతో పాటు.. మధ్యవర్తి సంస్థగా (Intermediary) తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది.
సమాచార సాంకేతిక (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 ప్రకారం, ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అక్రమ కంటెంట్ను తొలగించడం ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు తప్పనిసరి. ఈ నిబంధనలను టెలిగ్రామ్ కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే.. ప్రతి పైరసీ ఛానల్ను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి చెప్పే వరకు వేచి ఉండకూడదని కూడా కేంద్రం హెచ్చరించింది. టెలిగ్రామ్ స్వయంగా పర్యవేక్షణ చేపట్టి, పైరసీ కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
గత కొంతకాలంగా టెలిగ్రామ్పై భారత్లో పలు వివాదాలు తలెత్తుతున్నాయి. మోసాలు, వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాల నిర్వహణ, సున్నితమైన సమాచార ప్రసారం వంటి అంశాలపై ఇప్పటికే కేంద్రం నిఘా పెంచింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్ సేవలపై గతంలో కేంద్రం తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. ఇప్పుడు పైరసీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా చర్యతో డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టంగా కనపడుతుంది.
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్ఫ్లిక్స్లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!