Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! “లెక్కలు చెప్పండి.. చర్చకు రండి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. అమరావతిని తొమ్మిది నగరాల రాజధానిగా చెబుతూ ఇప్పుడు ఒక మున్సిపాలిటీ స్థాయికే పరిమితం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2015లో టెండర్లు పిలిచి, 2016లో శంకుస్థాపన చేసిన భవనాలను 2028లో ప్రారంభిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిలో నిర్మించిన భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరెవరు నివసిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వ భూములు లేదా కొనుగోలు చేసిన భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేసి ఉంటే తక్కువ వ్యయంతో పూర్తయ్యేదని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల అప్పులు చేసి అమరావతి నిర్మాణం చేపడుతున్నారని, భవిష్యత్తులో ఈ భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుందని విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే వాదన వాస్తవానికి విరుద్ధమని అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్వహణ, వర్షాకాలంలో నీటి పారుదల వంటి అంశాలపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీ అప్పులు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని ఎలా తీర్చబోతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తామని, తమను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా వెనక్కి తగ్గబోమని పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అమరావతికి సంబంధించిన ఆస్తుల వివరాలు, ఖర్చుల లెక్కలు ప్రజలకు వెల్లడించాలని కోరారు. అమరావతి అంశంతో పాటు రాష్ట్రంలోని ఇతర పరిణామాలపైనా పేర్ని నాని స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారుల డీజిల్ పంపిణీ, పోలీసుల వ్యవహారశైలి, డీఎస్సీ, లాకప్ డెత్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం లెక్కలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధంగా రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్దే కీలక పాత్ర!
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!