Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Government: ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ యథావిధిగా కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా బుధవారం, శనివారం రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ దినాలుగా నిర్ణయించారు.
ఇంధన పొదుపు కోసం ప్రత్యేక చర్యలు
వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు కార్యాలయాల పని వేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని సుమారు 20 శాతం తగ్గించడంతో పాటు, కొన్ని శాఖల్లో అధికారుల వాహనాల కాన్వాయ్లను కూడా కుదించారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంధనాన్ని ఆదా చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
మళ్లీ పాత కార్యాలయ వేళలు
తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాధారణ కార్యాలయ సమయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కార్యాలయాల పని వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి యథావిధిగా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా 90 రోజుల పాటు అమలు చేసిన హైబ్రిడ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేయడంతో, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ మళ్లీ పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే పనిచేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!