Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Government: ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ యథావిధిగా కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా బుధవారం, శనివారం రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ దినాలుగా నిర్ణయించారు.
ఇంధన పొదుపు కోసం ప్రత్యేక చర్యలు
వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు కార్యాలయాల పని వేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని సుమారు 20 శాతం తగ్గించడంతో పాటు, కొన్ని శాఖల్లో అధికారుల వాహనాల కాన్వాయ్లను కూడా కుదించారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంధనాన్ని ఆదా చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
మళ్లీ పాత కార్యాలయ వేళలు
తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాధారణ కార్యాలయ సమయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కార్యాలయాల పని వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి యథావిధిగా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా 90 రోజుల పాటు అమలు చేసిన హైబ్రిడ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేయడంతో, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ మళ్లీ పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే పనిచేయనున్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!