Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్లో చరిత్ర సృష్టించిన భారత్.. డబుల్ గోల్డ్
- చెస్ ఒలింపియాడ్ 2024లో చరిత్ర సృష్టించిన భారత్
- తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఇండియా
- ఓపెన్ సెక్షన్లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ తొలి బంగారు పతకం
- మహిళల జట్టు కూడా మరో స్వర్ణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళల జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత ప్లేయర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ లలో సత్తా చాటడంతో భారత పురుషుల జట్టు గోల్డో మెడల్ గెలుచుకుంది. రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్పై డీ గుకేశ్ విక్టరీ సాధించడంతో దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు.
Read Also: Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
బుడాపెస్ట్లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్దేవ్లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడంతో భారత్ రెండో స్వర్ణం అందుకుంది. కజకిస్థాన్ను అమెరికా ఓడించడంపైనే ఓపెన్ విభాగంలో భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. ఆదివారం అమెరికా తన ప్రత్యర్థిని 1-1తో డ్రా చేయడంతో భారత్ను విజేతగా ప్రకటించారు.
Read Also: Devara Latest Update: స్టేజ్ మీద బారికేడ్లు.. ఎన్టీఆర్ తో మాట్లాడించే యత్నం?
అంతకుముందు శుక్రవారం (సెప్టెంబర్ 20) భారత పురుషుల జట్టు ఇరాన్పై 3.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఓపెన్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా.. భారత పురుషుల జట్టు 2014 ఎడిషన్లో కాంస్యం, 2022లో కాంస్యం గెలుచుకుంది.
👏SUPER NEWS: 🇮🇳 India clinched gold at the the 2024 FIDE Chess Olympiad in the open section! 🥇
Congratulations to @DGukesh, @rpraggnachess, @ArjunErigaisi, @viditchess, @HariChess, @srinathchess (c) and the members involved!
🇮🇳 INDIA OP! pic.twitter.com/ycruqMqRZo
— Chess.com – India (@chesscom_in) September 22, 2024
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!