Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ..
- సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన..
- ఇండియా కూటమిలోని అభ్యర్థులందరూ ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే పోటీ..
- ఈ బైపోల్స్ ఇండియా బ్లాక్ విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది: అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బై ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’పైనే పోటీ చేస్తారని వెల్లడించారు. కూటమి నిర్ణయాన్ని సీట్ల పంపకానికి సంబంధించిన విషయమేమీ తెలియదు.. విజయం సాధించడం ఒకటే కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయి.. భారీ విజయం కోసం తాము కలిసి పోరాటం చేస్తున్నాం.. ఈ ఉప ఎన్నికలో ఇండియా కూటమి విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందన్నారు. అందరి మద్దతుతో ఉప ఎన్నికలో అన్ని సీట్లలో గెలుస్తామని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా రికార్డు!
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ఇక, నవంబరు 13వ తేదీన ఘజియాబాద్, మఝవాన్ (మీర్జాపూర్), సిసమావు (కాన్పూర్ సిటి), ఖైర్ (అలీఘర్), ఫుల్పూర్ (ప్రయాగ్ రాజ్), కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్పురి), మీరాపూర్ (ముజఫర్నగర్), కుందర్కి (మొరాదాబాద్) స్థానాలకు బైపోల్ జరగనున్నాయి. అయితే, 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారు. వారి స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే, క్రిమినల్ కేసులో దోషిగా తేలిన సమాజ్ వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు పడటంతో సిసమావు స్థానానికి సైతం బైఎలక్షన్స్ జరగబోతుంది. అయితే, పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. ఘజియాబాద్, ఖైర్ (అలీఘర్) రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. మిగిలిన స్థానాలను సమాజ్ వాది పార్టీకి వదిలివేసినట్లు వార్తలు వచ్చాయి. మిల్కీపూర్ (అయోధ్య)ని పక్కన బెట్టి తొమ్మిది స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇక, నవంబర్ 13న ఓటింగ్ జరగనుండగా.. 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!