Jai shankar: భారత్ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తుంది.. విదేశాంగ మంత్రి పోస్ట్ వైరల్!
Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ ఇకపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ చర్య భూమి, వాయు, సముద్ర మార్గాలన్నింటికి వర్తించనుంది. ఇది ఒక శాంతియుత చర్యగా భావించవచ్చు. అయితే, ఉగ్రవాదంపై భారత్ వైఖరి మాత్రం స్పష్టమైనదిగా ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దాని వ్యక్తీకరణ ఏ విధంగా ఉన్నా భారతదేశం దానికి సమాధానం ఇస్తుందని” పేర్కొన్నారు.
Read Also: India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?
Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
ఈ పరిణామాల నేపథ్యంలో, శాంతి దిశగా అడుగులు పడుతున్నప్పటికీ, జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగిన కాల్లో, భూమి, వాయు, సముద్ర మార్గాల్లో జరిగిన అన్ని మిలిటరీ చర్యలను తక్షణంగా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి అమలులోకి వస్తుందని అన్నారు. ఈ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ముందుగా ప్రకటించారు. ఆయన ప్రకటనలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ విరమణ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు.
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో