India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. “కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.” అని ట్రంప్ పేర్కొన్నారు.
READ MORE : IND PAK War: ‘మా పని కాదు..’ నుంచి ‘కాల్పుల విరమణ’ వరకు.. అమెరికా వైఖరి ఏంటి?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
1980 నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాగా.. 2010 నుంచి 2020 సెప్టెంబర్ వరకు దాదాపు 11,572 సార్లు పాకిస్థాన్ సరిహద్దుల్లో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనల్లో దాదాపు 240 మంది భారతీయలు(122 మంది ప్రజలు, 118 మంది భద్రతా బలగాలు) చనిపోయారు. 673 మంది పౌరులు, 594 మంది సైనికులు గాయపడ్డారు.
1972లో నియంత్రణ రేఖను నిర్ధరించిన అనంతరం సరిహద్దుల్లో దాదాపు 10ఏళ్ల పాటు ఎటువంటి ఉద్రిక్తతలు జరగలేదు. 1980 నుంచి యుద్ధ ట్యాంకులతో గస్తీ (సీఎఫ్వీ) జోరందుకోగా.. 1990లో కశ్మీర్లో తిరుగుబాటు తారాస్థాయికి చేరుకునే నాటికి ఇరుదేశాలు పూర్తి బలగాలను మొహరించాయి. 2001లో భారత్ తన సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మించడం ప్రారంభించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద కాల్పులు తీవ్రతరం అయ్యాయి. 2003 తర్వాత ఇరుదేశాలు యుద్ధ ట్యాంకులను దాదాపు 5 ఏళ్లపాటు నిషేధించాయి. ఈ దేశాల మధ్య ఆ సమయంలో జరిగిన చర్చలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ముంబయిలో 2008 ఉగ్రదాడుల తర్వాత శాంతి చర్చలకు తావు లేకుండా పోయాయి.
READ MORE : Anasuya : నడుము అందాలతో రెచ్చిపోయిన అనసూయ..
క్రమంగా సరిహద్దుల్లో యుద్ధట్యాంకుల అలజడి పెరిగింది. 2013లో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. ప్రతి ఏడాది అవి గణనీయంగా పెరుగుతున్నాయి. 2017లో భారత్ 1,970 సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 2018లో పాకిస్థాన్ 936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత్ ఆరోపించింది. ఆనాటికి 15 ఏళ్లలోనే ఆల్టైమ్ రికార్డది. 2018 మే నెలలో జమ్ముకశ్మీర్లో.. భారత్ నాన్-ఇనీషియేషన్ ఆఫ్ కాంబాట్ ఆపరేషన్లను ప్రకటించింది. దీన్నే రంజాన్ కాల్పుల విరమణ అంటారు. ఇది 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొనసాగింపు. అయితే కాలక్రమేణ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని.. 2019, 2020లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి నుంచి కూడా 2025 వరకు పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తోంది. తాజాగా అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో