Virat Kohli Century: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆలౌట్! విండీస్ స్కోర్ 86/1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI 2nd Test Day 2 Highlights: తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్తో రెండో రోజు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. దాంతో కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సాధించాడు. ఆపై మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. రనౌట్గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే జడేజా క్యాచ్ ఔట్ అయ్యాడు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!
విరాట్ కోహ్లీ, ఆర్ జడేజా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. ఆర్ అశ్విన్ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో జట్టును అందుకున్నాడు. ఇషాన్ కిషన్ (25), జయదేవ్ ఉనద్కత్ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇషాన్, ఉనద్కత్, మొహ్మద్ సిరాజ్ (0)లు పెవిలియన్ చేరడంతో ధాటిగా ఆడిన అశ్విన్.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. యాష్ బౌల్డవడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వారికన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
భారత్ ఆలౌటైన అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్కు ఓపెనర్లు క్రైగ్ బ్రాత్వైట్, త్యాగ్నారాయణ్ చందర్పాల్ (33) శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో బ్రాత్వైట్ నిలకడగా ఆడినా.. త్యాగ్నారాయణ్ బౌండరీలు బాదాడు. అయితే ఊపుమీదున్న చందర్పాల్.. జడేజా బౌలింగ్లో అశ్విన్కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ బాదిన అనంతరం రెండో రోజు ఆట ముగిసింది.
Also Read: Owaisi: మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!