IND vs NZ: స్వల్ప ఆధిక్యంలో టీమిండియా.. 263 ఆలౌట్
- టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్.
- మొదటి ఇన్నింగ్స్ లో 28 పరుగుల ఆధిక్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడు టెస్టు, చివరి మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్పై భారత్ 28 పరుగుల ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు రెండో రోజు మొదటి సెషన్ ను బాగానే ఆదింది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఎదురు దాడి చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా టీమిండియా చేయగలిగిందని చెప్పవచ్చు. అయితే రెండో రోజు రెండో సెషన్లో భారత బ్యాట్స్మెన్లు తమ లయను నిలబెట్టుకోలేకపోయారు. న్యూజిలాండ్ తరఫున అజాజ్ పటేల్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధికంగా శుభ్మన్ గిల్ 90 పరుగులు చేశాడు. అలాగే రిషబ్ పంత్ 60 పరుగులు చేసాడు.
Read Also: IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రిషబ్ పంత్ వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే 50 పరుగులు చేసి, అదే ప్రత్యర్థి జట్టుపై 41 బంతులు ఆడిన యశస్వి జైస్వాల్ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ పేరు అగ్రస్థానానికి చేరుకుంది. రిషబ్ పంత్ 114 బంతుల్లో శుభ్మన్ గిల్తో కలిసి 96 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న టీమిండియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. చివరిలో అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఎదురు దాడి చేసి 38 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
Read Also: IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా
Innings Break! #TeamIndia post 263 on the board, securing a 28-run lead!
Scorecard ▶️ https://t.co/KNIvTEy04z#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/sY2zHOS5t5
— BCCI (@BCCI) November 2, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!