IND vs ENG 4th Test: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!
- జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్
- భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- అర్ష్దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్
BCCI Update India Squad for 4th vs England: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న నాలుగో టెస్ట్ కోసం మార్పులతో భారత జట్టును (అప్డేట్ టీమ్) బీసీసీఐ ప్రకటించింది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్ట్లకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయం కారణంగా నాల్గవ టెస్ట్లో ఆడడం లేదు. అర్ష్దీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాంబోజ్ ఇప్పటికే మాంచెస్టర్లో భారత జట్టులో చేరాడు.
గాయం బారిన పడిన పేసర్ ఆకాష్ దీప్ మాంచెస్టర్ టెస్ట్కు అందుబాటులోనే ఉన్నాడు. ఆకాష్ నాలుగో టెస్టులో ఆడుతాడో లేదో చూడాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు మరలా శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా లేదా మహమ్మద్ సిరాజ్లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి.. అర్ష్దీప్ సింగ్ను అరంగేట్రం చేయిద్దామని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు. బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరికి రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్ను దింపే అవకాశాలు లేకపోలేదు. రిషభ్ పంత్ గాయంపై స్పష్టత లేదు. దాంతో ఇప్పుడు నాలుగో టెస్ట్ భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మాంచెస్టర్లో ఎవరు ఆడుతారో.
Also Read
Also Read: Viral Video: 2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు! చివరకు..
నాల్గవ టెస్టు కోసం అప్డేట్ టీమ్:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!