World Cup Final 2023: టీమిండియాకు కలిసొచ్చిన బుధవారం.. ఇక ఛాంపియన్ రోహిత్ సేననే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India have a Wednesday Sentiment in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా.. మెగా టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. ఇక అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని జ్యోతిష్యులు సహా ఫాన్స్ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.
బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు ముందే చెప్పగా.. అది నిజమైంది. భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తుందని జ్యోతిష్యులు సహా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 2011 నుంచి వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ గెలుస్తుందని, ఇప్పుడే భారత్ విశ్వవిజేత అవుతుందని అభిమానులు అంటున్నారు. తాజాగా మరో విషయం తెరపైకి వచ్చింది. టీమిండియాకు బుధవారం కలిసొస్తుందని, ఇక ఛాంపియన్ రోహిత్ సేననే అని సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు భారత్ రెండుసార్లు విజేతగా నిలవగా.. ఆ రెండు సందర్భాల్లోనూ భారత్ తన సెమీ ఫైనల్ మ్యాచ్ను బుధవారమే ఆడి గెలిచింది. ఈసారి కూడా బుధవారం సెమీస్ ఆడి గెలుపొందింది.
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
Also Read: IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. విజేత కెప్టెన్కు ట్రోఫీని అందజేయనున్న..! లక్కీ ఫెలో
1983 ప్రపంచకప్లో భారత్ జూన్ 22 సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. బుధవారం జరిగిన ఆ మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి.. ఫైనల్కు దూసుకెళ్లింది. ఫైనల్లో వెస్టిండీస్ను చిత్తుచేసి మొదటిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2011లో మార్చి 30న పాకిస్తాన్తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిచింది. ఆ రోజు కూడా బుధవారమే. ఫైనల్లో శ్రీలంకను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. 2023లో నవంబర్ 15న న్యూజిలాండ్తో సెమీస్ ఆడి గెలిచింది. యాదృచ్ఛికంగా ఆ రోజు కూడా బుధవారమే. దాంతో టీమిండియాకు బుధవారం కలిసొస్తుందని, ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుచేస్తుందని ఫాన్స్ అబిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ నిజమవుతుందో లేదో.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!