Atrocious : ‘నాన్న చనిపోయారు, ఇంటికి రా’.. భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తండ్రి చనిపోయాడని పిలిచినా రాకపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను హతమార్చాడు. నాలుగు నెలల క్రితం బిజేంద్ర, సంధ్య వివాహం చేసుకున్నారు. సంధ్య పాత్రపై బిజేంద్రకు అనుమానం వచ్చింది. సంధ్యకు వేరే వ్యక్తితో అనైతిక సంబంధం ఉందని అనుమానించాడు. సంధ్య మేనమామ మార్చి 19న కన్నుమూశారు. దీంతో ఆమె మార్చి 20న ఇంటికి వచ్చింది. సంధ్య మేనమామ షాజహాపూర్లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులందరూ షాజహాపూర్ వెళ్లారు, కానీ సంధ్య తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంది.
Read Also : Dowry: చెల్లి మీద ఎంత ప్రేమ..పెళ్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన రైతు సోదరులు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
దీని తరువాత, బిజేంద్ర తండ్రి మార్చి 21 న మరణించారు. దీంతో బిజేంద్ర సంధ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కానీ సంధ్య ఇంటికి రాలేదు. దీంతో బిజేంద్రకు కోపం వచ్చింది. మరుసటి రోజు మార్చి 22న అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో సంధ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంటికి రాకపోవడంతో సంధ్యను ప్రశ్నించాడు. అనంతరం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బిజేంద్ర సంధ్యను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Also :Sriram movies: ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్ జంటగా కొత్త సినిమా!
మరుసటి రోజు అత్తమామలు ఇంటికి వచ్చి చూడగా సంధ్య మృతదేహం కనిపించింది. బిజేంద్రకు ఫోన్ చేసి సంధ్య మృతి గురించి తెలియజేశాడు. భార్య మరణవార్త విన్న బిజేంద్ర మూర్ఛపోయినట్లు నటించాడు. అనంతరం సంధ్య అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో బిజేంద్ర ఇంటికి వస్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు బిజేంద్రను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు బిజేంద్రకు సంకెళ్లు వేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?