Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- విద్యా్ర్థులు ఇంటికెళ్లిపోండి
- సోనమ్కు ఆసక్తికర ఆఫర్
- సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా
- సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆందోళనపై మరోసారి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిరసనలు చేస్తున్న విద్యార్థులంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని, వారి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల భద్రత, విద్య మోడీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు.
“విద్యార్థులు విద్య, భద్రత పరంగా అత్యంత ముఖ్యమైనవారు. వారు తమ గురించి లేదా వారి తల్లిదండ్రులు వారి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే స్పందించారు. ఈ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి విద్యార్థులారా.. మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్లండి.” అని పోస్టు చేశారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
వాంగ్చుక్కు ‘ఇంటి భోజనం’ ఆఫర్
ఇక విద్యార్థులకు మద్దతుగా గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఉద్దేశించి కూడా సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సోనమ్… చాలు బ్రో. ఇక దీక్షను కొనసాగించొద్దు. కావాలంటే మా ఇంటి నుంచి భోజనం పంపిస్తాను.” అంటూ సరదాగా ట్వీట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రెండోసారి స్పందించిన సల్మాన్
విద్యార్థుల ఆందోళనపై సల్మాన్ ఖాన్ స్పందించడం ఇది రెండోసారి. బుధవారం కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీని “చాలా తీవ్రమైన అంశం”గా అభివర్ణించిన ఆయన.. మొదట విద్యార్థుల నిరసనలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయని, ఈ ఉద్యమాన్ని రాజకీయాలకు వేదికగా మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ప్రతిభ ఆధారిత, పారదర్శక విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్ధారించాలని కోరారు.
విద్యార్థులకు సినీ ప్రముఖుల మద్దతు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులకు మద్దతు ప్రకటించిన సినీ ప్రముఖుల్లో సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు. ఇప్పటికే హృతిక్ రోషన్, ఆలియా భట్, రాజ్కుమార్ రావు, ఆర్. మాధవన్, జాన్ క్యూసాక్, సోనాక్షి సిన్హా, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, షబానా ఆజ్మీ, ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్ తదితరులు కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నెలకు పైగా కొనసాగుతున్న సీజేపీ ఉద్యమం
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనలు నెల రోజులకుపైగా కొనసాగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. విద్యార్థులపై దారుణంగా లాఠీఛార్జ్ చేయడంతో విపక్ష పార్టీలు మద్దతుగా ఆందోళనలు చేపట్టాయి.

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..