Dowry: చెల్లి మీద ఎంత ప్రేమ..పెళ్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన రైతు సోదరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry for Sister Wedding: ఈ రోజుల్లో ఆస్తికోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధాల కన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న ఈ రోజుల్లో ఆ అన్నలు మాత్రం అలా ఆలోచించలేదు. ఆస్తులు కాదు తమకు చెల్లెలె ముఖ్యమని పెళ్లిని ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
ఇలా పెళ్లి వేడుకకు కట్న కానుకలు సమర్పించడాన్ని మైరా అంటారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని ధింగ్సార గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు తమ సోదరి వివాహ వేడుకలో ఎన్నడూ లేని విధంగా మైరాను చెల్లించి చరిత్ర సృష్టించారు. ఆమె సోదరి వివాహానికి మైరాగా సోదరులు మొత్తం రూ.8.1 కోట్లు చెల్లించారు. ధింగ్సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు కలిసి తన సోదరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. దీనిలో భాగంగా వీరు తమ చెల్లికి కానుకగా దాదాపు రూ.8.1 కోట్ల విలువ చేసే ఆస్తులను కానుకగా అందించారు. ఈ సోదరులు తమ సోదరికి మైరాలో రూ.2.21 కోట్ల నగదుతో పాటు, రూ.4 కోట్ల విలువైన 100 బిగాల భూమి, 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి, గూడా భగవాన్దాస్ గ్రామం వద్ద ట్రాక్టర్ నిండా గోధుమలు, 1 బిగా భూమి ఉన్నాయి.
Also Read
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
Read Also: TTD: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. గంటన్నరలో ఏప్రిల్ కోటా మొత్తం బుకింగ్
దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాల కాన్వాయ్ కొనసాగింది. అందులో వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లు మైరాను సమర్పించడానికి వారి సోదరి వద్దకు చేరుకున్నాయి. ఈ మైరాను సోదరులు అర్జున్ రామ్ మెహరియా, భగీరథ్ మెహరియా అందించారు.ఈ మైరా గత 10 రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఇద్దరు సోదరులు తమ సోదరికి మైరాను ఇచ్చారు. కాన్వాయ్ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
Read Also: Agent: పాన్ ఇండియా టాలెంట్ ని ఒక యూనివర్స్ గా మార్చబోతున్న అఖిల్
ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఒక రైతు కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు వివాహ వేడుకలో మైరాను అధిక మొత్తంలో చెల్లించారు. ఝడేలి గ్రామంలో జరిగిన వారి సోదరి కుమార్తె వివాహానికి సోదరులు మొత్తం రూ.3.21 కోట్లను మైరాగా చెల్లించారు. గత నెలలో అరడజను మైరా నిండగా, అవి ఒక్కొక్కటి కోటి వరకు ఉన్నాయి. మైరా అనేది కట్నం యొక్క ఒక రూపం. ఈ సంజ్ఞ వివాహ ఖర్చు యొక్క ఆర్థిక భారాన్ని పంచుకోవడానికి కుటుంబం ప్రతిజ్ఞను సూచిస్తుంది. మైరా సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం.ముఖ్యమైన జీవిత సంఘటనల సమయంలో కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం విలువను ప్రతిబింబిస్తుంది.
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!