Odisha: ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు..ఇంటి నుంచే పనిచేసిన మాజీ సీఎం
- 24 ఏళ్ల పాటు నవీన్ పట్నాయక్ 'వర్క్ ఫ్రమ్ హోమ్'
- కొత్త ముఖ్యమంత్రికి నివాసం వెతుకుతున్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. బీజేపీ మోహన్ మాఝీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే రెండో ప్రశ్నకు సమాధానం ఇంకా వెతుకుతూనే ఉంది. నిజానికి ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు. 24 ఏళ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మాత్రమే చేశారు. తన సొంత పూర్వీకుల ఇంటిని ముఖ్యమంత్రి నివాసంగా చేసుకుని ఇక్కడి నుంచే అన్ని పనులు నిర్వహించేవారు.
READ MORE: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ
Also Read
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
ఇప్పుడు దీని కారణంగా, కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వ నివాసం వెతుకుతోంది. ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను 78 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాగా, నవీన్ పట్నాయక్కు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) 51 సీట్లకు తగ్గింది. కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మోహన్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మాఝీ బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేవీ సింగ్ దేవ్, ప్రవతి పరిదా డిప్యూటీ సీఎంలు అయ్యారు. అయితే ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేకపోవడమే సమస్యగా మారింది.
READ MORE: Viral video: ఎయిర్పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు
2000 సంవత్సరంలో, నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి అయినప్పుడు.. అతను ప్రభుత్వ నివాసంలో కాకుండా తన వ్యక్తిగత నివాసం నుంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాని పేరు ‘నవీన్ నివాస్’గా పెట్టుకున్నారు. 24 ఏళ్లపాటు ఒడిశా అధికార కేంద్రంగా ‘నవీన్ నివాస్’ కొనసాగింది. అన్ని అధికారిక, పరిపాలనా పనులు ఇక్కడ నుంచే జరిగాయి. పట్నాయక్ పూర్వీకుల ఇల్లు కటక్లో ఉంది. నవీన్ పట్నాయక్ పుట్టింది ఇక్కడే. తరువాత, భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయినప్పుడు, బిజూ పట్నాయక్ ఇక్కడ ఒక బంగ్లాను నిర్మించారు. దానికి నవీన్ నివాస్ అని పేరు పెట్టారు.
నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కాకముందు.. హేమానంద బిస్వాల్, జెబి పట్నాయక్ భువనేశ్వర్ క్లబ్ సమీపంలోని ఒకే అంతస్థుల భవనం నుంచి పని చేసేవారు. 1995లో జేబీ పట్నాయక్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే సీఎం నివాసాన్ని రెండంతస్తుల భవనానికి మార్చారు.
2000లో, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ రెండంతస్తుల భవనాన్ని సీఎం గ్రీవెన్స్ సెల్గా మార్చారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!