RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ
- పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్లు.. $844.76 బిలియన్లకు చేరిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్
- భారత్ జీడీపీలో 24.1%గా మారిన రిజర్వ్ బ్యాంకు ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాలెన్స్ షీట్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన మంచి ఆదాయాన్ని ఆర్జించింది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆర్బీఐ డబ్బు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. మార్చి 31, 2024 నాటికి RBI బ్యాలెన్స్ షీట్ 11 శాతం పెరిగి రూ.70.48 లక్షల కోట్లు(సుమారు $844.76 బిలియన్లు)కు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. పాకిస్తాన్ జీడీపీ $338.24 బిలియన్లుగా అంచనా వేయబడింది.
READ MORE: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై23)లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ రూ.63.44 లక్షల కోట్లుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ మహమ్మారి తర్వాత ఆర్థిక పరిస్థితి పుంజుకుందని ఆర్బీఐ తెలిపింది. మార్చి 2024 చివరి నాటికి, ఇది భారతదేశ GDPలో 24.1%గా మారింది. ఇది మార్చి 2023 చివరి నాటికి 23.5%గా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఖర్చు 56.30% తగ్గిందని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ మిగులు కూడా వార్షిక ప్రాతిపదికన పెరిగింది. 141.23% వృద్ధి చెంది రూ.2.11 లక్షల కోట్లుగా మారింది. ఇటీవల ఈ మిగులు ప్రభుత్వానికి డివిడెండ్గా బదిలీ చేయబడింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ వేగంతో వృద్ధి చెందుతుందని 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యవసర నిధిగా రూ.42,820 కోట్లు కేటాయించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ ఆశాజనకంగానే ఉంది. స్థూల ఆర్థిక మూలాధారాల నిరంతర బలం కారణంగా, మంచి ఆర్థిక వృద్ధి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం అంచనా చుట్టూనే ఉంది. ఆర్బిఐ 2025 ఆర్థిక సంవత్సరానికి 7% వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసిందని తెలిసిందే.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!