Heat wave warning: ఈ రాష్ట్రాలకు వేడిగాలుల ముప్పు.. వాతావరణశాఖ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులైతే వేడి తీవ్రతను తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. మరో వారం పాటు తీవ్ర వేడిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..
Also Read
ఏప్రిల్ 17 నుంచి 21 వరకు గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఏప్రిల్ 17-18 తేదీల్లో గంగా పశ్చిమ బెంగాల్, ఏప్రిల్ 17-21 వరకు బీహార్, ఏప్రిల్ 19- 21 వరకు జార్ఖండ్, ఏప్రిల్ 17, 20 మరియు 21 తేదీల్లో ఒడిశాలో హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు సురక్షితంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Suresh Raina: ధోనీ నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
వేడి తరంగాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హార్ట్ పేషెంట్లు చల్లని, నీడ ప్రాంతాల్లో ఉండాలని తెలిపింది. సూర్యకాంతి పడకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
భారత్లో ఎండలు ఇలా దంచికొడుతుంటే.. పశ్చిమాసియలో మాత్రం వరదలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి ఒమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్లాడిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. బుధవారం కూడా వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!