Diabetes: ఈ అలవాట్లు ఉంటే మధుమేహం పెరిగినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో మధుమేహం వేగంగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధుమేహం నుంచి కొద్దికొద్దీగా బయటపడాలంటే.. మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఒత్తిడితో పాటు, ఈ వ్యాధిని ప్రేరేపించే అనేక అంశాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిలో జన్యుశాస్త్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డయాబెటిక్ తల్లిదండ్రుల పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. కానీ మంచి ఆహారం మరియు జీవనశైలిని అనుసరించడం ద్వారా దీనిని 90 శాతం వరకు నియంత్రించవచ్చు. మనం రోజూ చేసే కొన్ని అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Girls Fighting : ఓరి నాయనో.. వీళ్ళు ఆడవాళ్లా.. రౌడీలా?
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
ఆహార లేమి
మీరు మీ ఆహారం సరిగ్గా తీసుకోకపోతే మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జంక్ ఫుడ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్ ఫుడ్స్ తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. ఇలాంటి ఆహారాన్ని రోజూ తినడం వల్ల ఊబకాయం మరియు మధుమేహం ముప్పు మరింత పెరుగుతుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, నిద్ర మరియు ఒత్తిడి కారణంగా మన శరీరం ఒత్తిడి హార్మోన్ల కార్టిసాల్ మరియు వాసోప్రెసిన్ స్థాయిని పెంచుతుంది. ఇవన్నీ మధుమేహం వల్ల వచ్చేవే. అందుకే మీ జీవనశైలిలో వ్యాయామాన్ని ఖచ్చితంగా చేర్చుకోండి.
West Bengal: పంచాయతీ ఎన్నికల్లో హింస.. 600కు పైగా బూత్లలో రీపోలింగ్
శుద్ధి చేసిన పిండి పదార్థాలు
పిండి మరియు శుద్ధి చేసిన చక్కెర వంటివి మధుమేహ ప్రమాదాన్ని పెంచుతాయి. శుద్ధి చేసిన చక్కెర మరియు మైదా కార్బోహైడ్రేట్లు మాత్రమే. కాబట్టి అవి మన రక్తప్రవాహంలో వేగంగా శోషించబడతాయి. ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
ధూమపానం
సిగరెట్, హుక్కా వంటి ధూమపానానికి సంబంధించిన వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీరంపై చెడు ప్రభావం చూపి మధుమేహాన్ని పెంచుతాయి.
ఒత్తిడి
మీ జీవితంలో ఎక్కువ ఒత్తిడి ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం పూర్తిగా ఉంటుంది. ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను గందరగోళానికి గురి చేస్తుంది. దాని ప్రభావంతో మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!