West Bengal: పంచాయతీ ఎన్నికల్లో హింస.. 600కు పైగా బూత్లలో రీపోలింగ్
West Bengal: బెంగాల్ పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు జరిగిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం అనేక పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను రద్దు చేసింది. జులై 10, సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజా పోల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు సోమవారం 604 బూత్లలో రీపోలింగ్ జరగనుంది.
ముర్షిదాబాద్లో 175 బూత్లలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. మాల్డాలో 112, నాడియాలో 89, ఉత్తర 24 పరగణాలలో 46, దక్షిణ 24 పరగణాలలో 36, పుర్బా మేదినీపూర్లో 31, హుగ్లీలో 29, దక్షిణ్ దినాజ్పూర్లో 18, జల్పాయిగురిలో 14, బీర్భూమ్లో 14, పశ్చిమ మేదినీపూర్లో 10, బంకురాలో 8, హౌరాలో 8, పశ్చిమ్ బర్ధమాన్లో 6, పురూలియాలో 4, పుర్బా బర్ధమాన్ 3, అలీపుర్దువార్లోని ఒక బూత్లో రీపోలింగ్ జరగనుంది. దక్షిణ 24 పరాగణాలలో 10, డైమండ్ హార్బర్లోని 36 బూత్లలో రీ-పోలింగ్ జరుగుతుంది. గోసాబా 5, జోయ్నగర్లో 5, బసంతిలో నాలుగు, కుల్తాలిలో 3, జోయ్నగర్ IIలో ఒక బూత్లో, మందిర్ బజార్లో రెండు, బిష్ణుపూర్, బరుయిపూర్, మధురాపూర్, మగ్రాహత్లలో ఒక్కొక్క బూత్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
Also Read
Also Read: Chhattisgarh: ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో కోసం బీజేపీ ప్యానెల్ ఏర్పాటు
బెంగాల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. శనివారం హింసాత్మక వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 19 మంది చనిపోయారు. పగటిపూట బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను ధ్వంసం చేసిన అనేక సంఘటనలు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) జిల్లా మేజిస్ట్రేట్ (DM) నుంచి మరణాలు, హింసపై వివరణాత్మక నివేదికలను కోరింది. రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీ వ్యవస్థలో మొత్తం 73,887 స్థానాలకు ఎన్నికలు జరగగా, లక్షా 2.06 లక్షల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాత్కాలికంగా 66.28 శాతం ఓటింగ్ నమోదైంది, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 5.67 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?