ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో మధుమేహం వేగంగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధుమేహం నుంచి కొద్దికొద్దీగా బయటపడాలంటే.. మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ సాయంతో రక్తపోటును చెకప్ చేసుకునేందుకు మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం తయారుచేసింది. ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తయారు చేసేందుకు 80 సెంట్స్ ఖర్చు అయ్యింది. అయితే దీనిని 10 సెంట్లకు తీసుకొచ్చేలా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సైటిఫిక్ రిపోర్ట్స్ లోని జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. దీని సాయంతో రెగ్యూలర్ బీపీ మోనిటరింగ్ సులభతరం…