Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. “గడిచిన పదేళ్లలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు తప్ప. కులాల మధ్య, ప్రాంతాల మధ్య లింక్ పెడుతూ ద్వేషాన్ని రెచ్చగొట్టింది బీజేపీ. ఈ సారి అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగంను మారుస్తామని ప్రధాని మోడీ అనేక వేదికల్లో చెపుతున్నారు. బీజేపీ అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశ ప్రజల క్షేమం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసింది. అందరి బాగోగుల కోసం, దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. రాజకీయ లబ్ధికోసమే, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కర్ర పట్టుకుని కేసీఆర్ జనం లోకి వస్తున్నారు. నామ నాగేశ్వరరావు ను కేంద్రం లో మంత్రి ఎలా చేస్తారు అని అడిగాము. అక్రమంగా సంపాదించిన లక్షా యాభై వేల కోట్లను దాచుకునేందుకు, కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. మొదటి నుండి కాంగ్రెస్ చెపుతుంది..బీజేపీ తొత్తు పార్టీ బీఆర్ఎస్ అని.”
READ MORE: Samantha Vs Sobhita: ఇదేంటి సోషల్ మీడియాలో ఇంత డైరెక్టుగానా?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల కార్డ్ లు,పెన్షన్ లు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. “డబల్ బెడ్ రూమ్ లు అనే బొమ్మను చూపించి రెండు సార్లు కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ళను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత అందరం వచ్చి ముగ్గు పోసే కార్యక్రమం చేపడతాం. ఇది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వం. ఇచ్చిన హామీల పట్ల చిత్త శుద్ధితో ప్రభుత్వం పని చేస్తుంది. ఆగస్టు 15 లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీ తో గెలిపించాలి.”
“ఎవరెన్ని కుట్రలు పన్నినా,కుయుక్తులు పన్నినా ఈ ప్రభుత్వం లో కూడా మంత్రిగా ఉండే అవకాశం మీ వల్లే దక్కింది. మేము ఎంత మంది ఉన్న డిల్లీలో పనులు ఉంటాయి. అందుకోసమే రామ సహాయం ను గెలిపించాలి. లంకాసాగర్ కు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను తీసుకువస్తాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తూనే రెండు,మూడు నెలల్లో రుణ మాఫీ చేస్తాం. సంక్షేమ పథకాలు పేద వాళ్లకు చేరుతున్నాయో లేదో ఎమ్మెల్యే చూసుకోవాలి. ముఖ్యమంత్రి సహకారం తో మీకు కావల్సిన పనులను పూర్తి చేస్తాం.”
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!