Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. “గడిచిన పదేళ్లలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు తప్ప. కులాల మధ్య, ప్రాంతాల మధ్య లింక్ పెడుతూ ద్వేషాన్ని రెచ్చగొట్టింది బీజేపీ. ఈ సారి అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగంను మారుస్తామని ప్రధాని మోడీ అనేక వేదికల్లో చెపుతున్నారు. బీజేపీ అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశ ప్రజల క్షేమం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసింది. అందరి బాగోగుల కోసం, దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. రాజకీయ లబ్ధికోసమే, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కర్ర పట్టుకుని కేసీఆర్ జనం లోకి వస్తున్నారు. నామ నాగేశ్వరరావు ను కేంద్రం లో మంత్రి ఎలా చేస్తారు అని అడిగాము. అక్రమంగా సంపాదించిన లక్షా యాభై వేల కోట్లను దాచుకునేందుకు, కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. మొదటి నుండి కాంగ్రెస్ చెపుతుంది..బీజేపీ తొత్తు పార్టీ బీఆర్ఎస్ అని.”
READ MORE: Samantha Vs Sobhita: ఇదేంటి సోషల్ మీడియాలో ఇంత డైరెక్టుగానా?
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల కార్డ్ లు,పెన్షన్ లు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. “డబల్ బెడ్ రూమ్ లు అనే బొమ్మను చూపించి రెండు సార్లు కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ళను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత అందరం వచ్చి ముగ్గు పోసే కార్యక్రమం చేపడతాం. ఇది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వం. ఇచ్చిన హామీల పట్ల చిత్త శుద్ధితో ప్రభుత్వం పని చేస్తుంది. ఆగస్టు 15 లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీ తో గెలిపించాలి.”
“ఎవరెన్ని కుట్రలు పన్నినా,కుయుక్తులు పన్నినా ఈ ప్రభుత్వం లో కూడా మంత్రిగా ఉండే అవకాశం మీ వల్లే దక్కింది. మేము ఎంత మంది ఉన్న డిల్లీలో పనులు ఉంటాయి. అందుకోసమే రామ సహాయం ను గెలిపించాలి. లంకాసాగర్ కు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను తీసుకువస్తాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తూనే రెండు,మూడు నెలల్లో రుణ మాఫీ చేస్తాం. సంక్షేమ పథకాలు పేద వాళ్లకు చేరుతున్నాయో లేదో ఎమ్మెల్యే చూసుకోవాలి. ముఖ్యమంత్రి సహకారం తో మీకు కావల్సిన పనులను పూర్తి చేస్తాం.”
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!