Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ఇలాంటి సంఘటనల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్లు అనిపిస్తోంది. ఈ ఘటనలు చూస్తుంటే గుండెపోటు మరణాలకు కరోనాతో సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు.
గుండెపోటు, కోవిడ్ కారణంగా సంభవించే మరణాల మధ్య సంబంధాన్ని అంచనా వేయడానికి ICMR అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీని ఫలితాలు 2 నెలల్లో రానున్నాయి. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ… కరోనా తర్వాత గుండెపోటు మరణాల రేటు పెరిగిందని అంగీకరించాడు. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న టీకా గణాంకాలు ఆధారంగా ICMR గత 3-4 నెలలుగా అధ్యయనం కొనసాగిస్తోందన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధ్యయన నివేదిక వచ్చే రెండు నెలల్లో వస్తుందని మాండవియా చెప్పారు.
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
Read Also: Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు
ఢిల్లీలోని ఎయిమ్స్ గుండెపోటు కారణంగా మరణించిన వారి డేటాను కూడా సమీక్షిస్తోంది. భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఎగుమతి కోసం కూడా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచామని మాండవియా పేర్కొన్నారు. భారతదేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మొదట్లో చెప్పామని కేంద్ర మంత్రి అన్నారు. కానీ నేడు భారతదేశం అత్యుత్తమ వ్యాక్సిన్ ప్రచారం, కరోనా నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. బిల్ గేట్స్ కూడా భారత్పై ప్రశంసలు కురిపించారని చెప్పారు.
Read Also: Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 50ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 50%, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 25% మంది గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే యువతలో గుండెపోటు రేటు పెరుగుతోందని, మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండె జబ్బులతో బాధపడుతున్నారని అర్థం. అధిక రక్తపోటు, షుగర్, ఒత్తిడి, ఊబకాయం, తగినంత నిద్ర లేకపోవడం, క్రమబద్ధమైన జీవనశైలి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా పరిగణించబడతాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో రక్తం గడ్డకట్టే రేటు వేగంగా పెరిగిందని, ఈ పెరిగిన గుండె జబ్బుతో కరోనాకు ఏదైనా సంబంధం ఉందా అని నిర్ధారించడానికి అధ్యయనాలు కూడా జరుగుతున్నాయని చాలా మంది నిపుణులు ఊహించారు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!