Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ఇలాంటి సంఘటనల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్లు అనిపిస్తోంది. ఈ ఘటనలు చూస్తుంటే గుండెపోటు మరణాలకు కరోనాతో సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు.
గుండెపోటు, కోవిడ్ కారణంగా సంభవించే మరణాల మధ్య సంబంధాన్ని అంచనా వేయడానికి ICMR అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీని ఫలితాలు 2 నెలల్లో రానున్నాయి. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ… కరోనా తర్వాత గుండెపోటు మరణాల రేటు పెరిగిందని అంగీకరించాడు. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న టీకా గణాంకాలు ఆధారంగా ICMR గత 3-4 నెలలుగా అధ్యయనం కొనసాగిస్తోందన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధ్యయన నివేదిక వచ్చే రెండు నెలల్లో వస్తుందని మాండవియా చెప్పారు.
Also Read
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
Read Also: Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు
ఢిల్లీలోని ఎయిమ్స్ గుండెపోటు కారణంగా మరణించిన వారి డేటాను కూడా సమీక్షిస్తోంది. భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఎగుమతి కోసం కూడా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచామని మాండవియా పేర్కొన్నారు. భారతదేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మొదట్లో చెప్పామని కేంద్ర మంత్రి అన్నారు. కానీ నేడు భారతదేశం అత్యుత్తమ వ్యాక్సిన్ ప్రచారం, కరోనా నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. బిల్ గేట్స్ కూడా భారత్పై ప్రశంసలు కురిపించారని చెప్పారు.
Read Also: Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 50ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 50%, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 25% మంది గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే యువతలో గుండెపోటు రేటు పెరుగుతోందని, మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండె జబ్బులతో బాధపడుతున్నారని అర్థం. అధిక రక్తపోటు, షుగర్, ఒత్తిడి, ఊబకాయం, తగినంత నిద్ర లేకపోవడం, క్రమబద్ధమైన జీవనశైలి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా పరిగణించబడతాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో రక్తం గడ్డకట్టే రేటు వేగంగా పెరిగిందని, ఈ పెరిగిన గుండె జబ్బుతో కరోనాకు ఏదైనా సంబంధం ఉందా అని నిర్ధారించడానికి అధ్యయనాలు కూడా జరుగుతున్నాయని చాలా మంది నిపుణులు ఊహించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!