Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ఇలాంటి సంఘటనల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్లు అనిపిస్తోంది. ఈ ఘటనలు చూస్తుంటే గుండెపోటు మరణాలకు కరోనాతో సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు.
గుండెపోటు, కోవిడ్ కారణంగా సంభవించే మరణాల మధ్య సంబంధాన్ని అంచనా వేయడానికి ICMR అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దీని ఫలితాలు 2 నెలల్లో రానున్నాయి. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ… కరోనా తర్వాత గుండెపోటు మరణాల రేటు పెరిగిందని అంగీకరించాడు. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న టీకా గణాంకాలు ఆధారంగా ICMR గత 3-4 నెలలుగా అధ్యయనం కొనసాగిస్తోందన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధ్యయన నివేదిక వచ్చే రెండు నెలల్లో వస్తుందని మాండవియా చెప్పారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
Read Also: Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు
ఢిల్లీలోని ఎయిమ్స్ గుండెపోటు కారణంగా మరణించిన వారి డేటాను కూడా సమీక్షిస్తోంది. భారతదేశ అవసరాలను తీర్చడమే కాకుండా ఎగుమతి కోసం కూడా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచామని మాండవియా పేర్కొన్నారు. భారతదేశం వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మొదట్లో చెప్పామని కేంద్ర మంత్రి అన్నారు. కానీ నేడు భారతదేశం అత్యుత్తమ వ్యాక్సిన్ ప్రచారం, కరోనా నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. బిల్ గేట్స్ కూడా భారత్పై ప్రశంసలు కురిపించారని చెప్పారు.
Read Also: Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 50ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 50%, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 25% మంది గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే యువతలో గుండెపోటు రేటు పెరుగుతోందని, మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండె జబ్బులతో బాధపడుతున్నారని అర్థం. అధిక రక్తపోటు, షుగర్, ఒత్తిడి, ఊబకాయం, తగినంత నిద్ర లేకపోవడం, క్రమబద్ధమైన జీవనశైలి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా పరిగణించబడతాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో రక్తం గడ్డకట్టే రేటు వేగంగా పెరిగిందని, ఈ పెరిగిన గుండె జబ్బుతో కరోనాకు ఏదైనా సంబంధం ఉందా అని నిర్ధారించడానికి అధ్యయనాలు కూడా జరుగుతున్నాయని చాలా మంది నిపుణులు ఊహించారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!