Damodara Rajanarsimha: నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయం ఉపసంహరణ..
- ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ.. EHS.. ఆరోగ్య భద్రత కార్డులపై..
- నగదు రహిత సేవలను కొనసాగిస్తాం- తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్
- బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20వ తేదీ లోగా బకాయిలు చెల్లించని ఎడల..
- నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక
- తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే బకాయిలు అందజేస్తామన్న మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా.. పేద, మధ్యతరగతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, పోలీసు సిబ్బందికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు రహిత సేవలు అందిస్తోంది. అయితే ఆ సేవలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20వ తేదీ లోగా బకాయిలు చెల్లించని ఎడల నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని చేసిన హెచ్చరికపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణం స్పందించారు.
Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
Also Read
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా స్పెషాలిటీ హాస్పిటల్స్ అందిస్తున్న నగదు రహిత సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్.. ఈనెల 20వ తేదీ నుండి నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అలాగే.. నిరంతరం నగదు రహిత సేవలను కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు లేఖను మంత్రి దామోదర్ రాజనర్సింహకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ నరసింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న.. నగదు రహిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెరుగైన వైద్య సేవలను నిరంతరం అందించాల్సిందిగా తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ను కోరారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!