IAS Amoy Kumar : ఈడీ ఆఫీసుకు ఐఏఎస్ అమోయ్ కుమార్ బాధితులు
- ఐఏఎస్ అమోయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఈడీ ఆఫీసుకు పలువురు బాధితులు
- ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణ
- ఇప్పుడు ఓనర్లమైన తమను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు బాధితులు హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఈడీ అధికారులను కలిశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని… శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో… 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ప్లాట్ లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు ఓనర్లమైన తమను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
KTR : ఇది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య
Also Read
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
మాజీ మంత్రి అండతో తమ ప్లాట్ లను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి… విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని తెలిపారు. కేటిఆర్ స్నేహితుల కంపెనీలు అయిన ఫోనెక్స్, శ్రీనిధి కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి మంత్రి ప్రోద్భలంతోనే కలెక్టర్ అమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని పేర్కొన్నారు. అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు సుమారు 200 ఎకరాల తమ ఫ్లాట్ లను వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. తమ స్థలాన్ని గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు , బ్యూరోక్రాట్స్ ఉన్నారని… వేల కోట్లు విలువ చేసే తమ ప్లాట్ లను తమకు ఇప్పించాలని… అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
UP: ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. వివాహిత ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రేమికుడు..
తాజావార్తలు
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!