AV Ranganath : ప్రమాదంపై క్షణాల్లో సమాచారం చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలి
- అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
- అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు
- ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గింది: ఏవీ రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు.
డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం భవన రెండో అంతస్తులో ప్రారంభమై ఆకాశ్ ఇన్స్టిట్యూట్ (Akash Institute) నడుస్తున్న ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనపై రంగనాథ్ మాట్లాడుతూ, అగ్నిమాపక దళాలు , హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సమయానికి చేరుకోవడంతో మంటలను రెండో అంతస్తు పరిధిలోనే అడ్డుకోవడం సాధ్యమైందని ప్రశంసించారు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా భవనంలోని మొత్తం రెండు సెల్లార్లు, నాలుగు పై అంతస్తుల్లో పొగ వ్యాపించినట్లు స్పష్టం చేశారు.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు:
రంగనాథ్, భవన యజమానులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. భవనంలో అగ్నిప్రమాదం ప్రారంభమైన క్షణాల్లో అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాద సమాచారం హైడ్రా డీఆర్ఎఫ్కు తక్షణమే చేరే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆధునిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు. భవనంలో ఫైర్ అలారమ్ వ్యవస్థ ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల నిజమైన కారణాలను తెలుసుకునేందుకు భవనంలోని సీసీ టీవీ ఫుటేజీని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవన యజమానులు , నిర్వహణ సిబ్బంది భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో హైడ్రా డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని రంగనాథ్ వెల్లడించారు. ఇటువంటి విపత్తులను ముందుగానే అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Purandeswari: చంద్రబాబు, అమిత్షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!