AV Ranganath : ప్రమాదంపై క్షణాల్లో సమాచారం చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలి
- అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
- అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు
- ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గింది: ఏవీ రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు.
డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం భవన రెండో అంతస్తులో ప్రారంభమై ఆకాశ్ ఇన్స్టిట్యూట్ (Akash Institute) నడుస్తున్న ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనపై రంగనాథ్ మాట్లాడుతూ, అగ్నిమాపక దళాలు , హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సమయానికి చేరుకోవడంతో మంటలను రెండో అంతస్తు పరిధిలోనే అడ్డుకోవడం సాధ్యమైందని ప్రశంసించారు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా భవనంలోని మొత్తం రెండు సెల్లార్లు, నాలుగు పై అంతస్తుల్లో పొగ వ్యాపించినట్లు స్పష్టం చేశారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు:
రంగనాథ్, భవన యజమానులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. భవనంలో అగ్నిప్రమాదం ప్రారంభమైన క్షణాల్లో అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాద సమాచారం హైడ్రా డీఆర్ఎఫ్కు తక్షణమే చేరే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆధునిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు. భవనంలో ఫైర్ అలారమ్ వ్యవస్థ ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల నిజమైన కారణాలను తెలుసుకునేందుకు భవనంలోని సీసీ టీవీ ఫుటేజీని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవన యజమానులు , నిర్వహణ సిబ్బంది భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో హైడ్రా డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని రంగనాథ్ వెల్లడించారు. ఇటువంటి విపత్తులను ముందుగానే అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Purandeswari: చంద్రబాబు, అమిత్షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..