AV Ranganath : ప్రమాదంపై క్షణాల్లో సమాచారం చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలి
- అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
- అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు
- ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గింది: ఏవీ రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు.
డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం భవన రెండో అంతస్తులో ప్రారంభమై ఆకాశ్ ఇన్స్టిట్యూట్ (Akash Institute) నడుస్తున్న ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనపై రంగనాథ్ మాట్లాడుతూ, అగ్నిమాపక దళాలు , హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సమయానికి చేరుకోవడంతో మంటలను రెండో అంతస్తు పరిధిలోనే అడ్డుకోవడం సాధ్యమైందని ప్రశంసించారు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా భవనంలోని మొత్తం రెండు సెల్లార్లు, నాలుగు పై అంతస్తుల్లో పొగ వ్యాపించినట్లు స్పష్టం చేశారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
అగ్ని ప్రమాదాల నివారణకు సూచనలు:
రంగనాథ్, భవన యజమానులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. భవనంలో అగ్నిప్రమాదం ప్రారంభమైన క్షణాల్లో అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాద సమాచారం హైడ్రా డీఆర్ఎఫ్కు తక్షణమే చేరే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆధునిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు. భవనంలో ఫైర్ అలారమ్ వ్యవస్థ ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదానికి గల నిజమైన కారణాలను తెలుసుకునేందుకు భవనంలోని సీసీ టీవీ ఫుటేజీని సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవన యజమానులు , నిర్వహణ సిబ్బంది భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో హైడ్రా డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని రంగనాథ్ వెల్లడించారు. ఇటువంటి విపత్తులను ముందుగానే అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Purandeswari: చంద్రబాబు, అమిత్షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!